స్ట్రెచర్‌పైనే సునీతా విలియమ్స్‌ సహా నలుగురిని ఎందుకు తీసుకెళ్లారు?

sunita williams : సునీతా విలియమ్స్‌, ఇతరులు కోలుకునేందుకు ఎలాంటి చికిత్సలు అవసరం?

అంతరిక్షంలో నివసించడం, భూమిపైకి తిరిగిరావడం అనేది కష్టమైన, సవాళ్లతో కూడిన ప్రయాణం. భూమికి తిరిగొచ్చాక కూడా వ్యోమగాములు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం, దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండి భూమిపైకి తిరిగొచ్చాక వ్యోమగాములు మామూలుగా నిలబడలేరు. కనీసం కుదురుగా నడవలేరు. తమవారిని చూడటానికి వెంటనే నేరుగా ఇంటికి కూడా వెళ్లలేరు. అంతరిక్షం నుంచి వచ్చాక వ్యోమగాముల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. వాటి నుంచి వారు ఎలా కోలుకుంటారు? కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది?

స్ట్రెచర్‌పైనే సునీతా విలియమ్స్‌ సహా నలుగురిని ఎందుకు తీసుకెళ్లారు?

ఆ వాసన, గాలి చాలా అద్భుతం
అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన తర్వాత నాసా సైంటిస్ట్ విక్టర్ గ్లోవర్‌తో చేసిన ఇంటర్వ్యూను నాసా వెబ్‌సైట్ ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూలో ”భూమిపైకి తిరిగొచ్చాక మీరు మొదట చూసిన వాసన ఏంటి?” అని ఆయన కూతురు ప్రశ్నించారు. సముద్రంలో స్టార్‌షిప్ దిగగానే తనకు మొదట సముద్రపు వాసన వచ్చిందని ఆయన బదులిచ్చారు. ”ఆ వాసన, గాలి చాలా అద్భుతం” అని ఆయన చెప్పారు.

ఎముకల నుంచి కంటిచూపు వరకు: అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాములు ఎదుర్కొనే తొలి సమస్య ఎముకల సాంద్రత క్షీణించడం. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల, భూమిపై ఉన్నప్పటిలా బరువును మోయగలిగేలా వెన్నెముక, పెల్విస్‌ పటిష్టంగా ఉండవు. కాబట్టి అంతరిక్షంలో రోజులు గడిచేకొద్దీ ఎముకల సాంద్రత ప్రతీ నెలకూ 1 నుంచి 1.5 శాతం వరకు క్షీణిస్తుంది. కండరాల, ఎముకల బలహీనతను నివారించేందుకు వ్యోమగాములు రోజుకు 2 గంటల పాటు వ్యాయామం చేయాలి.
అంతరిక్షంలో తేలుతూ ఉండి, భూమిపైకి వచ్చాక వ్యోమగాములు నిలబడలేరు, కనీసం నడవలేరు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీరంలో ద్రవాలు పైకి అంటే తలలోకి కదులుతాయి. ఇవి కళ్లపై ఒత్తిడి పెంచి కంటిచూపు సమస్యలకు దారి తీస్తాయి.

Related Posts
America: అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన
అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్‌ అధికారులు Read more

‘శీష్ మహల్‌’పై విచారణకు ఆదేశించిన కేంద్రం
Center has ordered an inquiry into 'Sheesh Mahal'

కేజ్రీవాల్‌ను వెంటాడుతున్న కష్టాలు న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. బంగ్లా Read more

ఈరోజు జార్ఖండ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ
Rahul Gandhi will visit Jharkhand today

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ Read more

విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్
విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్

భారత పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు దారుణమైన సంఘటనకు గురైంది. ఈ పర్యటనలో భాగంగా, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *