Center has ordered an inquiry into 'Sheesh Mahal'

‘శీష్ మహల్‌’పై విచారణకు ఆదేశించిన కేంద్రం

కేజ్రీవాల్‌ను వెంటాడుతున్న కష్టాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. బంగ్లా పునరుద్ధరణ పనుల్లో అక్రమాలు జరిగాయాంటూ బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు ఫిర్యాదు చేశారు. ఎల్జీ ఆదేశాలతో ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల శాఖ నివేదిక సమర్పించింది. తాజాగా పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ ఖజానాను విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తుకు ఆదేశించింది.

Advertisements

‘శీష్ మహల్‌’ విచారణకు ఆదేశించిన కేంద్రం

ఖజానాను వృధా చేశారని బీజేపీ ఆరోణలు

కేజ్రీవాల్.. ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌స్టాప్ రోడ్‌లోని బంగ్లాలో 2015 నుంచి 2024 వరకు నివాసం ఉన్నారు. ఆ సమయంలో బంగ్లా పునర్ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ ఖజానాను వృధా చేశారని బీజేపీ ఆరోపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ అగ్ర నేతలంతా ఈ విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేశారు. ‘శీష్ మహల్’ అంటూ ఆరోపణలు గుప్పించింది. మొత్తానికి ఆప్ అధికారాన్ని కూడా కోల్పోయింది. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ హయాంలో జరిగిన అవకతవకలపై కేంద్రం దృష్టి సారించింది.

మహిళలకు ఛాన్స్ ఉండొచ్చని ఊహాగానాలు

కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ముఖ్యమంత్రి పేరును ఇంకా ప్రకటించలేదు. ఇందుకోసం అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. మహిళలకు ఛాన్స్ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం ఉండే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts
తీవ్ర వాయు కాలుష్యం..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు..
Severe air pollution.Key instructions of Union Health Ministry

న్యూఢిల్లీ: శీతాకాలం, పండుగలు సమీపిస్తున్నప్పుడు, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. Read more

Hyderabad : తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం
Hyderabad తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం

Hyderabad : తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి,సిద్దిపేట,యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి Read more

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు అనుకూల పరిస్థితులు: కమిన్స్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు అనుకూల పరిస్థితులు: కమిన్స్

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడే అవకాశాన్ని పొందడం "భారీ ప్రయోజనం" కలిగిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. హైబ్రిడ్ మోడల్‌లో Read more

ఎక్నాథ్ షిండే ఎన్నికలలో విజయం సాధిస్తామని తెలిపారు
Ekanth Shinde

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్నాథ్ షిండే, తమ ఓటును థానే జిల్లాలో వేసిన తరువాత, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. "మహా Read more

×