Rahul Gandhi will visit Jharkhand today

ఈరోజు జార్ఖండ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో పాల్గొననున్నారు. 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన మాట్లాడనున్నారు. జార్ఖండ్ పర్యటనలో రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా భేటీ కానున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లిన తర్వాత రేపు (అక్టోబర్ 20న) కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరగనుంది. జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్‌ ఆఫీసులో జరిగింది. అభ్యర్థుల పేర్లపై భేటీలో చర్చించారు. రాష్ట్ర ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇక, ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు తర్వాత కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం క్యాండిడెట్ల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా కొనసాగుతుంది.. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించాం.. రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా చర్చలు జరిగాయని ఆయన అన్నారు. కాగా, రేపు (ఆదివారం) మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది.

Related Posts
ట్రైడెంట్ గ్రూప్ కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్‌
Trident Group Karmayogi Recruitment Drive

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌తో.. సమాజంలో ఉన్న కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, అదే విధంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడం పట్ల తన అంకితభావాన్ని Read more

ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
Private Bus Exploitation Du

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్బంగా ప్రజలు సొంతూర్లకు వెళ్లేందుకు ఉత్సాహంగా సిద్ధంగా కాగా.. పండుగ రద్దీ కారణంగా ప్రయాణాలకు సంబంధించిన కష్టాలు అధికమవుతున్నాయి. హైదరాబాద్ Read more

2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు : ఐరాస
India population will be 170 crores by 2061 .

చైనా జనాభా 2021 నుంచి క్రమంగా తగ్గుముఖం న్యూయార్క్‌: ప్రపంచ జనాభా ధోరణులపై ఐక్యరాజ్య సమితి అంచనాలు విడుదల చేసింది. 2061 నాటికి భారత్‌ జనాభా 170 Read more

‘దొరికినకాడికి దోచుకో… అందినంత దండుకో’ ఇది కాంగ్రెస్ దందా – కేటీఆర్
ktr jail

భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాష్ట్రంలో అక్రమ వ్యాపారాలు, సహజ వనరుల దోపిడీపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *