న్యూజిలాండ్తో జరగనున్న చివరి టీ20 (T20) మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు దైవదర్శనం చేసుకున్నారు. (Thiruvananthapuram) తిరువనంతపురంలోని చారిత్రక శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరగనున్న సిరీస్లోని ఆఖరి మ్యాచ్కు ముందు వారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్-రౌండర్ అక్షర్ పటేల్, బ్యాటర్ రింకు సింగ్, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వెళ్లారు. ఈ సిరీస్ ఆరంభం నుంచి భారత ఆటగాళ్లు తరచూ (Thiruvananthapuram) ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన నాలుగో మ్యాచ్కు ముందు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
Read Also: Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్స్టాగ్రామ్
ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. (Thiruvananthapuram) ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఘనంగా ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచకప్కు సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్, ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ను అమెరికాతో ఆడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: