हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

Anusha
India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ,ఇరుదేశాల మ‌ధ్య రోజురోజుకూ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా స్పందించింది.భార‌త్‌, పాకిస్థాన్ సంయ‌మ‌నం పాటించాలని శ‌నివారం చైనా విదేశాంగ శాఖ(Department of Foreign Affairs) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.భార‌త్‌-పాక్ మ‌ధ్య నెలకొన్న ఉద్రిక్త‌త పరిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాం. స్థిర‌త్వం, శాంతి కోసం ఇరుదేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుతున్నాం. ఉద్రిక్త‌త‌ల‌ను తీవ్ర‌త‌రం చేసే చ‌ర్య‌ల‌ను రెండు దేశాలు త‌గ్గించుకోవాలి. శాంతియుతంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. ఇరుదేశాల మ‌ధ్య స‌మ‌స్య‌ ముగింపున‌కు అవ‌స‌ర‌మైతే నిర్మాణాత్మ‌క పాత్ర పోషించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని చైనా విదేశాంగ శాఖ త‌న‌ ప్ర‌క‌ట‌నలో పేర్కొంది.భార‌త్ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌, పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీఓకే)ల‌లోని ఉగ్ర‌స్థావరాలే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) చేప‌ట్టింది. తొమ్మిది ప్రాంతాల్లో క్షిప‌ణి దాడులు నిర్వ‌హించి సుమారు 100 మంది ముష్క‌రుల‌ను మట్టుబెట్టింది. కానీ, దాయాది పాకిస్థాన్ మాత్రం నీచ బుద్ధితో భార‌త్‌లోని పౌరులే ల‌క్ష్యంగా స‌రిహ‌ద్దు వెంబ‌డి డ్రోన్‌, మిస్సైల్ దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త తీవ్ర‌త‌ర‌మైంది.

అమెరికా ఏమందంటే

భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(S. Jaishankar) తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే చర్చలు జరపాలని కోరారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకటన విడుదల చేశారు.

 India-Pakistan: రెండు దేశాలు  సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన
India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

జీ7 దేశాలు 

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. ఇరుదేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా సైనిక సంఘర్షణను వెంటనే తగ్గించుకోవాలని కోరాయి. ఇరుదేశాల మధ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపాయి.అలాగే పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి. సైనిక ఘర్షణల(Military Conflict) వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని స్పష్టం చేశాయి. భారత్‌- పాక్‌ లోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని వెల్లడించాయి. శాంతిస్థాపన కోసం ఇరుదేశాలు చర్చల్లో పాల్గొనాలని కోరాయి.

Read Also: Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870