శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు

Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు

జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir) లోని శ్రీనగర్‌ (Srinagar)మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం 11.45 గంటల ప్రాంతంలో రెండు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని, దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆర్మీ (Army) అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయ (Srinagar airpot) పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే స్పందించిన భద్రతా బలగాలు, పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలలో ఉండకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisements
Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు
Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు

శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సులో క్షిపణి
అంతకుముందు, అవంతిపురా సమీపంలో కూడా ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సులో క్షిపణిని పోలిన ఓ వస్తువు పడి ఉన్నట్లు గుర్తించామని వారు వివరించారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌ విమానాశ్రయం, ఎయిర్‌ బేస్‌ లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేయగా, భారత్ సైన్యం ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ వరుస పేలుళ్ల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా శ్రీనగర్‌తో పాటు ఉత్తర, పశ్చిమ భారత్‌లోని మొత్తం 32 విమానాశ్రయాలను ఈ నెల 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Ishaq Dar: భారత్ ఇక్కడ ఆగిపోతే మేము కూడా ఆగిపోతాం: పాక్ విదేశాంగ శాఖ మంత్రి

Related Posts
మోదీ ప్రభావం: నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రశంసలు
మోదీ ప్రభావం: నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా, నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు, భారతదేశ అభివృద్ధికి మోదీ నాయకత్వం మరియు దృష్టిని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి Read more

ప్రయాగ్ లో భారీగా ట్రాఫిక్ జామ్
ప్రయాగ్ లో భారీగా ట్రాఫిక్ జామ్

ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ రోజు భక్తుల రద్దీతో మరింత గందరగోళం పెరిగింది. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు Read more

తెలంగాణ లో నేటి నుండి ఇంటర్ ఎగ్జామ్స్
exams

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఫస్ట్‌ ఇయర్ విద్యార్థుల కోసం ఈ పరీక్షలను మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజు Read more

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా
Eknath Shinde resigns as Maharashtra CM

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×