हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Jayaprakash Narayan: జేపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

Anusha
Jayaprakash Narayan: జేపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు.సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, పాకిస్థాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో భారత్‌ తమపై 2019 పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత దాడిచేసినట్టు మరోసారి మెరుపు దాడులకు దిగుతుందేమోనని దాయాది భావిస్తోంది.దీంతో ఈ దాడికి కారణమైన పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన కీలకమైన సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ భారత్ నిర్ణయంతో ఆందోళనకు గురవుతోంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారత్ చేసిన ప్రకటన పట్ల పాకిస్థాన్ రాజకీయ నేతలు, ఉగ్ర నేతలు మండిపడుతున్నారు. సింధూ జలాలను పాకిస్థాన్‌కు రాకుండా ఆపితే సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుందని లష్కరే తోయిబా చీఫ్ సయ్యద్ హఫీజ్ హెచ్చరించారు.

ఇబ్బంది

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన విషయమై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌కు వచ్చే నష్టమేమీ ఉండదని జేపీ స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై అవగాహన లేకుండానే సయ్యద్ హఫీజ్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడన్నారు.‘సింధూ నదిలో నీటి ప్రవాహం గోదావరి నది కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఈ నదిలో నీళ్లు అందుబాటులో ఉంటాయి. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 80 శాతం, భారతదేశం 20 శాతం చొప్పున నీటిని వాడుకునేలా నిర్ణయించారు. కానీ దాదాపు 84 శాతం జలాలను పాకిస్థాన్ వాడుకుంటుండగా భారత్ వినియోగం 16 శాతానికి మాత్రమే పరిమితమైంది’’ అని జేపీ చెప్పుకొచ్చారు.సింధు జలాల ఒప్పందం ప్రకారం దౌత్య పరంగా ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడాలని మాత్రమే మనం పట్టుబడుతున్నాం తప్పితే పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టాలనేది భారత్ ఉద్దేశం కాదని జయప్రకాష్ నారాయణ వివరించారు. సింధూ జలాలను ఆపినా మన దగ్గర నిల్వ చేసుకునే అవకాశం లేదన్నారు. ఒప్పందం ప్రకారం రావాల్సిన వాటాలో సుమారు 300 టీఎంసీల నీటిని కూడా భారత్ వాడుకోవడం లేదని జేపీ గుర్తు చేశారు. మన భూభాగం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహించే చీనాబ్ నది జలాలను రావి, బియాస్ నదులకు టన్నెల్ ద్వారా మళ్లించి మనం వాడుకున్నప్పటికీ పాకిస్థాన్‌కు వచ్చే నష్టమేమీ లేదన్న జేపీ పాకిస్థాన్ అనవసరంగా అడ్డుపడుతోందన్నారు.

 
Jayaprakash Narayan: జేపీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

ఒప్పందం

ప్రపంచంలో రెండు దేశాల మధ్య నదీ జలాల కోసం చేసుకున్న గొప్ప ఒప్పందంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని జేపీ అభివర్ణించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఈ ఒప్పందం కుదిర్చిందని, ఆ మధ్య తలెత్తిన వివాదాన్ని కూడా వరల్డ్ బ్యాంకే పరిష్కరించిందని వివరించారు.1960వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా ప్రవహించే బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారతదేశానికి పశ్చిమానికి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్థాన్ నియంత్రణ ఉంటుంది. 

Read Also: Mark Carney: కెనడా ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం.. మోదీ శుభాకాంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870