వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను ప్రీ ప్లాన్గా జరిగిందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇమామ్లతో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అల్లర్ల కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.
బంగ్లాదేశ్ పాత్ర ఉన్నట్లు చెబుతున్న హోం శాఖ
వక్ఫ్ చట్టం మూలంగా ముర్షీదాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఇందులో బంగ్లాదేశ్ పాత్ర ఉన్నట్లు హోం శాఖ చెబుతోంది. ఒకవేళ ఇదే నిజం అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సరిహద్దు బాధ్యత బీఎస్ఎఫ్ చూసుకోవాలి రాష్ట్రం కాదు. బయట నుంచి వచ్చి అల్లర్లు సృష్టించడానికి బీజేపీ వాళ్లు ఎందుకు అనుమతిని ఇచ్చారు.

కాళీ మాత ఆలయాన్నిచేశాను
నేను అన్ని మతాల గురించి మాట్లాడుతాను. కాళీ మాత ఆలయాన్ని అభివృద్ధి చేసినప్పుడు బీజేపీవాళ్లు ఎక్కడికి వెళ్లారు. మేం దుర్గా పూజ, సరస్వతి పూజ నిర్వహించేటప్పుడు ఇక్కడ చేయనియమని అన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలి. అదే మన సంప్రదాయం. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. కానీ గోడీ మీడియా మాత్రం అవేవీ పట్టించుకోకుండా బంగాల్కు వ్యతిరేకంగా, నా గురించి మాట్లాడుతున్నాయి. ఏమైనా చెప్పాలనుకుంటే నాకు ఎదురుగా వచ్చి మాట్లాడండి. ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయకండి.
Read Also: Mamata Banerjee : పశ్చిమబెంగాల్ నిరసనలో ఆయన హస్తం ఉంది: మమతా బెనర్జీ