రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

Riyadh: రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ ‌ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. సోమవారం రష్యాతోనూ చర్చలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లో సమగ్ర శాంతి ఒప్పందానికి ముందు, తక్షణ పాక్షిక కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని వాషింగ్టన్ భావిస్తోంది. అందుకే రియాద్ చర్చల్లో ఈ అంశం ఏదైనా ఓ కొలిక్కి వస్తుందా లేదా అని అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే అది ఎవరు ఎవరి మాట వింటారనే దానిపై ఆధారపడి ఉంది. “పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని భావిస్తున్నాను ” అని అమెరికా అధ్యక్షుడి తరపు దూత స్టీవ్ విట్‌కాఫ్ అన్నారు. “మీరు సోమవారం రియాద్‌లో జరిగే చర్చల్లో అసలైన పురోగతి చూస్తారు” అని ఆయన అన్నారు.

రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం
అయితే రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ అంచనాలను కొట్టి పారేశారు. “మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం” అని ఆయన రష్యా అధికార టెలివిజన్ చానల్‌తో చెప్పారు. శనివారం రాత్రి రష్యా కీయెవ్ మీద డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. “దాడులు ఆపాలని పుతిన్ నిజమైన ఆదేశాలు జారీ చేసేలా ఆయనపై మేం ఒత్తిడి తేవాల్సి ఉంది.
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే..
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే, యుక్రెయిన్ పోర్టుల నుంచి నల్ల సముద్రం మీదుగా ఎగుమతి అయ్యే గోధుమ నౌకలపై రష్యా దాడులు చేయకుండా ఉండే ఒప్పందాన్ని పునరుద్దరించవచ్చని భావిస్తున్నారు. యుద్ధంలో భాగంగా రష్యా, యుక్రెయిన్‌ తమ ప్రత్యర్థుల మౌలిక వసతుల మీద దాడులు చేశాయి. యుక్రెయిన్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల మీద దాడులు చేయడం ద్వారా ఆ దేశ ప్రజలు చీకటి, చలితో బాధ పడేలా రష్యా దాడులు చేసింది.

Related Posts
అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ నేతల వాకౌట్‌
BRS leaders walk out from the assembly

హైదరాబాద్‌: పంచాయితీ నిధుల వ్యవహారంపై అసెంబ్లీలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ సభ్యులు చెప్పాల్సింది చెప్పారు. అయితే సభ్యులపై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం Read more

మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్
LIC Mutual Fund launched Multi Asset Allocation Fund

ముంబై : భారతదేశంలోని ప్రసిద్ధ ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, డెట్ మరియు బంగారంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్ అయిన ఎల్ఐసి Read more

Goods Train : అతి పొడవైన, అతి బరువైన గూడ్స్ రైలు ఏదో తెలుసా?
super vasuki

భారతదేశంలో ఇప్పటివరకు నడిపిన అతి పొడవైన, అతి బరువైన గూడ్స్ రైలు 'సూపర్ వాసుకి'. ఇది మొత్తం 3.5 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక Read more

కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం..10 మంది మృతి
10 dead after fruit and veg

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *