10 dead after fruit and veg

కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం..10 మంది మృతి

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు 50 మీటర్ల లోయలో పడటంతో ప్రమాద స్థాయి ఎక్కువైంది.

Advertisements


సావనూర్ నుంచి యల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన మరో 10 మందిని వెంటనే హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులు సవనూరు తాలూకాకు చెందినవారని, లారీలో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మృతులను ఫయాజ్ ఇమామ్ సాబ్ జమఖండి (45), వసీం వీరుల్లా ముదగేరి (35), ఇజాజ్ ముస్తాకా ముల్లా (20), సాదిక్ భాష్ ఫరాష్ (30), గులాముషేన్ జవలి (40), ఇంతియాజ్ మమజాపర్ ములకేరి (36), అల్పాజ్ జాఫర్‌లుగా గుర్తించారు. మందక్కి (25), జీలానీ అబ్దుల్ జఖాతి (25) అస్లాం బాబులీ బట్టర్ (24)గా గుర్తించారు.

అంతకు ముందు కూడా రాష్ట్రంలో మరో ప్రమాదం ఈరోజు ఉదయం జరుగగా..ఈ ప్రమాదంలో ఐదు మందిపైన చనిపోయారు. ప్రమాదంలో మృతిచెందిన వారింతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నారు. పునరావృతమైన ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు సంబంధిత చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు మరియు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి పలు చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారుల వంతు నుండి గట్టి విజ్ఞప్తులు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts
కాంగ్రెస్ ఎంపీ – రకీబుల్ హుస్సేన్‌పై దాడి
కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ పై జరిగిన దాడి

అస్సాం కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దాడి – అసలు సంగతి ఏమిటి? అస్సాంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ Read more

భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?
భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి శుక్రవారం భారత్, పాకిస్తాన్ మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఇటీవల జరిగిన Read more

రేపు PSLV-C60 కౌంట్రెన్
PSLV C60

ఏపీలో శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్ Read more

నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..
Today is International Mens Day

న్యూఢిల్లీ: నేడు అనగా 19 నవంబర్ 2024, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజంలో పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం, Read more

×