కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు 50 మీటర్ల లోయలో పడటంతో ప్రమాద స్థాయి ఎక్కువైంది.
సావనూర్ నుంచి యల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన మరో 10 మందిని వెంటనే హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులు సవనూరు తాలూకాకు చెందినవారని, లారీలో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
మృతులను ఫయాజ్ ఇమామ్ సాబ్ జమఖండి (45), వసీం వీరుల్లా ముదగేరి (35), ఇజాజ్ ముస్తాకా ముల్లా (20), సాదిక్ భాష్ ఫరాష్ (30), గులాముషేన్ జవలి (40), ఇంతియాజ్ మమజాపర్ ములకేరి (36), అల్పాజ్ జాఫర్లుగా గుర్తించారు. మందక్కి (25), జీలానీ అబ్దుల్ జఖాతి (25) అస్లాం బాబులీ బట్టర్ (24)గా గుర్తించారు.
అంతకు ముందు కూడా రాష్ట్రంలో మరో ప్రమాదం ఈరోజు ఉదయం జరుగగా..ఈ ప్రమాదంలో ఐదు మందిపైన చనిపోయారు. ప్రమాదంలో మృతిచెందిన వారింతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నారు. పునరావృతమైన ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు సంబంధిత చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు మరియు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి పలు చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారుల వంతు నుండి గట్టి విజ్ఞప్తులు వ్యక్తం అవుతున్నాయి.