BRS leaders walk out from the assembly

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ నేతల వాకౌట్‌

హైదరాబాద్‌: పంచాయితీ నిధుల వ్యవహారంపై అసెంబ్లీలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ సభ్యులు చెప్పాల్సింది చెప్పారు. అయితే సభ్యులపై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఏం చెబుతుందో వినకుండానే సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే పంచాయితీ నిధులు పెండింగ్‌పై వివిధ పార్టీల సభ్యులు తమ ప్రశ్నలు లేవనెత్తారు. గడిచిన పదేళ్లు పంచాయితీలకు నిధులు రాలేదని, కనీసం లైట్లు వేసిన సందర్భం లేదన్నారు. రోడ్లు సహా పంచాయితీలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి వివిధ పార్టీల సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Advertisements

ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కాసింత ఆవేశంగా మాట్లాడారు. దీనికి కౌంటరిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. ప్రతీ నెలా 270 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సభ్యులు చెప్పారని అన్నారు మంత్రి. ప్రతీనెలా నిధులు చెల్లించిన తర్వాత బకాయిలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. తెలంగాణలో డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు సదరు మంత్రి. ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తి అయ్యిందన్నారు. ఒకవేళ బకాయిలున్నా నెల రోజులకు సంబంధించి ఉంటాయని అన్నారు. ప్రతీనెల బీఆర్ఎస్ హయాంలో 270 కోట్ల రూపాయలు ఇచ్చామన్నప్పుడు, బకాయిలు ఎలా ఉంటాయని సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్‌బాబు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ బకాయిలు మా నెత్తి మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ పెట్టిన బకాయిలను ఒక దాని తర్వాత మరొకటి తీర్చుకుంటూ వస్తున్నామన్నారు. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని దుయ్యబట్టారు. సభను పక్కదాని పట్టించి కేవల రాజకీయాలతో పరపతిని పెంచుకునే ఉద్దేశం చేస్తోందన్నారు.

అంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, కాంగ్రెస్‌ది ఆపన్నహస్తం కాదని.. భస్మాసుర హస్తమన్నారు. నిబంధనల ప్రకారం సభను నడిపించ లేదన్నారు. తమ హయాంలో రెగ్యులర్‌గా పంచాయతీలకు నిధులు విడుదల చేశామన్నారు. పంచాయితీలకు రూ. 691 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నవంబర్‌లో బడా కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్లు ఇచ్చారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

Related Posts
Badrachalam: మిథిలా మండపంలోనే భద్రాద్రి సీతారాముల కల్యాణం.. ప్రత్యేకం ఏమిటి?
మిథిలా మండపంలోనే భద్రాద్రి సీతారాముల కల్యాణం.. ప్రత్యేకత మీకు తెలుసా?

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణను కలిగించే పవిత్ర క్షేత్రంగా నిలిచింది. రామ భక్తుడు భద్రుని తపస్సుతో Read more

Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత
Tamilasai: తమిళిసై తండ్రి కన్నుమూత

తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమారి అనంతన్ (93). అనారోగ్యం, Read more

PM Modi: యువ‌తిపై సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన‌ ప్ర‌ధాని మోదీ
యువ‌తిపై సామూహిక అత్యాచార ఘటనపై స్పందించిన‌ ప్ర‌ధాని మోదీ

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వార‌ణాసిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా, ఇటీవల 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన గురించి ఆయన పోలీసులు మరియు కలెక్టర్‌తో Read more

Rajeev Yuva Vikasam : ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు
Rajeev Yuva Vikasam ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొంత నిరాశను మిగులుస్తోంది. ఈ పథకం ద్వారా స్వయం Read more

Advertisements
×