రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

Riyadh: రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ ‌ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. సోమవారం రష్యాతోనూ చర్చలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లో సమగ్ర శాంతి ఒప్పందానికి ముందు, తక్షణ పాక్షిక కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని వాషింగ్టన్ భావిస్తోంది. అందుకే రియాద్ చర్చల్లో ఈ అంశం ఏదైనా ఓ కొలిక్కి వస్తుందా లేదా అని అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే అది ఎవరు ఎవరి మాట వింటారనే దానిపై ఆధారపడి ఉంది. “పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని భావిస్తున్నాను ” అని అమెరికా అధ్యక్షుడి తరపు దూత స్టీవ్ విట్‌కాఫ్ అన్నారు. “మీరు సోమవారం రియాద్‌లో జరిగే చర్చల్లో అసలైన పురోగతి చూస్తారు” అని ఆయన అన్నారు.

Advertisements
రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం
అయితే రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ అంచనాలను కొట్టి పారేశారు. “మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం” అని ఆయన రష్యా అధికార టెలివిజన్ చానల్‌తో చెప్పారు. శనివారం రాత్రి రష్యా కీయెవ్ మీద డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. “దాడులు ఆపాలని పుతిన్ నిజమైన ఆదేశాలు జారీ చేసేలా ఆయనపై మేం ఒత్తిడి తేవాల్సి ఉంది.
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే..
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే, యుక్రెయిన్ పోర్టుల నుంచి నల్ల సముద్రం మీదుగా ఎగుమతి అయ్యే గోధుమ నౌకలపై రష్యా దాడులు చేయకుండా ఉండే ఒప్పందాన్ని పునరుద్దరించవచ్చని భావిస్తున్నారు. యుద్ధంలో భాగంగా రష్యా, యుక్రెయిన్‌ తమ ప్రత్యర్థుల మౌలిక వసతుల మీద దాడులు చేశాయి. యుక్రెయిన్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల మీద దాడులు చేయడం ద్వారా ఆ దేశ ప్రజలు చీకటి, చలితో బాధ పడేలా రష్యా దాడులు చేసింది.

Related Posts
Rahul Gandhi: అమెరికా పర్యటనకు వెళ్లనున్న రాహుల్‌ గాంధీ..!
Rahul Gandhi to visit America.

Rahul Gandhi: ఏప్రిల్‌ 19 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈసందర్భంగా ఆయన బ్రౌన్‌ యూనివర్శిటీని సందర్శిస్తారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతోనూ Read more

TG GOVT : తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు
bombay high court

బాంబే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు వాణిజ్య ప్రకటనలలో ఉపయోగించడం ఆందోళనకరమని కోర్టు Read more

అన్ని బస్సులకు ఉచిత ప్రయాణం :చంద్రబాబు నాయుడు
అన్ని బస్సులకు ఉచిత ప్రయాణం :చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విషయంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు Read more

వైఎస్ షర్మిలతో, విజయసాయిరెడ్డి భేటీ?
వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

రాజకీయాల్లోకి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మరొక కొత్త సంచలనం సృష్టించారు. మూడు రోజుల క్రితం, ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల నివాసానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×