हिन्दी | Epaper

Trump: సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

Vanipushpa
Trump: సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

అమెరికా సుప్రీంకోర్టులో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే. డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన సుంకాల పెంపు విధానాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆ ఉత్తర్వులన్నింటినీ రద్దు చేసింది. దీంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అయితే డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి భారత్ మీద బాంబును పేల్చాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. Powered By 1999 లో సర్వీస్ లోకి వచ్చా.. 20 ఏళ్లు పట్టింది గెజిటెడ్ అవ్వడానికి | Oneindia Telugu భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు నిర్ణయం గ్లోబల్ టారిఫ్ విధానానికి మాత్రమే వర్తిస్తుందని.. భారత్‌కు సంబంధించి ఇప్పటికే నిర్ణయించిన వాణిజ్య నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందంలో ఏమీ మారదు.

Read Also: Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా

  Even after the Supreme Court's ruling, tariffs on India will continue.
Even after the Supreme Court’s ruling, tariffs on India will continue.

రెండు దేశాల మధ్య చర్చించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం

భారత్ టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటుంది. మేము మాత్రం టారిఫ్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌కు సంబంధించిన వాణిజ్య విధానంలో అమెరికా వెనక్కి తగ్గబోతోందనే అంచనాలకు తావులేకుండా చేశాయి. రెండు దేశాల మధ్య చర్చించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం మేరకు భారత వస్తువులపై సుమారు 18 శాతం టారిఫ్‌లు కొనసాగుతాయి. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై భారత్ నుంచి పెద్దగా టారిఫ్ భారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారత ఎగుమతిదారులకు కొంత భారం అయినప్పటికీ.. అమెరికా మార్కెట్‌లో ప్రవేశానికి ఇది ఒక అవకాశంగా కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ట్రంప్ పరిపాలన విధించిన గ్లోబల్, పరస్పర టారిఫ్‌లు చట్టానికి విరుద్ధమని తీర్పు ఇచ్చింది. 1977లో రూపొందించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ఆధారంగా ఇంత విస్తృతంగా టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అధిక టారిఫ్‌లను తగ్గించి 18 శాతానికి పరిమితం

ఈ తీర్పుతో ట్రంప్ పరిపాలన అమలు చేసిన కొన్ని ప్రధాన టారిఫ్ విధానాలు రద్దయ్యాయి. మోదీ దూకుడు దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. భారత వస్తువులపై 50 నుండి 18 శాతానికి సుంకాలు తగ్గింపు.. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పు దేశ ఆర్థిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు. అదే సమయంలో మరో చట్టం అయిన Section 122 ఆధారంగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీని ద్వారా కోర్టు తీర్పు తర్వాత కూడా టారిఫ్ విధానాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తామని సంకేతాలు ఇచ్చారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యాన్ని చూస్తే.. ఇటీవల ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల్లో ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదిరినట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా విధిస్తున్న 25 శాతం వరకు ఉన్న అధిక టారిఫ్‌లను తగ్గించి 18 శాతానికి పరిమితం చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తన ఉత్పత్తులపై అదే స్థాయి టారిఫ్‌లు చెల్లించేందుకు అంగీకరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

📢 For Advertisement Booking: 98481 12870