हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

BRS: హైడ్రా లాగా మేము ‘కోబ్రా’ తీసుకు వస్తాం: బీఆర్‌ఎస్‌ నేతలు

sumalatha chinthakayala
BRS: హైడ్రా లాగా మేము ‘కోబ్రా’ తీసుకు వస్తాం: బీఆర్‌ఎస్‌ నేతలు

BRS : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకు వచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకు రావడానికి కోబ్రా అని తీసుకువస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం నుంచి మొదలుకొని వారి కుటుంబ సభ్యుల వరకు భూములు అగ్రిమెంట్ చేసుకుంటూ కబ్జాలు పాల్పడుతున్నారని ఆరోపించారు.

హైడ్రా లాగా మేము 'కోబ్రా'

మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి

మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే హైవే రోడ్డు మీద పడ్డ మందు లారీ లెక్క అయిందని విమర్శించారు. ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకొని పోదాం అనే తప్ప పార్టీని బతికిద్దాం అని ఎవరికీ లేదన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందన్నారు. కాళేశ్వరం మీద సీఎం రేవంత్‌ కక్షకట్టారని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ప్రజల గుండెల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తిరగబడేరోజు వస్తుందని బాల్క సుమన్ అన్నారు.

Read Also: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870