తెలంగాణ (Telangana) హైకోర్టు గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై తీర్పును ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. ఈ వాయిదా అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఫలితాల ప్రకటనలో జాప్యం కారణంగా, అనేకమంది అభ్యర్థులు తమ భవిష్యత్తుపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.అభ్యర్థుల ఆశలు, ఆందోళనల మధ్య ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Medchal crime: మద్యం మత్తులో గొడవ.. గొడ్డలి తో తల నరికిన వైనం

తుది తీర్పు వాయిదా
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ TGPSC , అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ తీర్పు వెలువడనుంది, దీనితో నియామకాల భవితవ్యం తేలనుంది, నియామక ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష 2024లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
సింగిల్ జడ్జి తీర్పు ఫలితాలను రద్దు చేసి, పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశించారు, దీనితో అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సింగిల్ జడ్జి తీర్పును TGPSC, ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్లో సవాలు చేశారు. వాదనలు పూర్తయిన తర్వాత, జనవరి 22, 2026న తీర్పును వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది. కానీ తీర్పు కాపీ రానందున తుది తీర్పు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: