తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో జరిగిన పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గత నెలలో జరిగిన BSc థర్డియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీలో వీసీ జానయ్య సందర్శన సందర్భంగా ఈ విషయం బయటపడింది. దీంతో వారి అడ్మిషన్లు రద్దు చేసి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరగనుంది.
Read also: TG: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
ఇటీవల జగిత్యాల వ్యవసాయ కళాశాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జనయ్య, ఇతరులు సందర్శించినప్పుడు, సెమిస్టర్ పరీక్షల రికార్డులను, క్లోజ్డ్-సర్క్యూట్ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత ప్రశ్నపత్రం లీకేజీపై సందేహాలు రావడంతో, ఈ అంశంపై లోతైన విచారణ కోసం వైస్-ఛాన్సలర్ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు.

ప్రక్షాళనే లక్ష్యం: వీసీ అల్దాస్ జానయ్య
2014 నుంచి 2024 వరకు వర్సిటీలో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం వల్లే ఇలాంటి అవకతవకలు జరిగాయని వీసీ జనయ్య మండిపడ్డారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసే ఎవరినీ వదిలిపెట్టమని.. అవసరమైతే ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగిస్తామన్నారు. పరీక్షా విధానంలో ఆధునిక సాంకేతికతను జోడించి సమూల మార్పులు తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: