Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలిసి ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానం అందించారు.
Read Also: Yadadri incident: గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

ఐక్యతకు ప్రతీకగా ఇఫ్తార్ వేడుక
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ స్పందిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ పవిత్ర రంజాన్ మాసంలో మార్చి 15న జరిగే ఇఫ్తార్ విందుకు ఆహ్వానించాను. ఈ పవిత్ర సమయం అందరిలో శాంతి, కృతజ్ఞత, ఐక్యతను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అని పేర్కొన్నారు. ఈ మాసంలో నాయకులు, ప్రముఖులు మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి అజారుద్దీన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: