రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పళ్లతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి తిమ్మాపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటన తిమ్మాపురం జాతీయ రహదారి (Thimmapuram National Highway) పై ఉదయం సంభవించింది. పరిమితికి మించిన వేగంతో వెళ్తున్న లారీ ఒకే ఒక మలుపులో అదుపుతప్పి రోడ్డు మధ్య బోల్తా పడింది. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిమితికి మించిన వేగంతో దూసుకువచ్చిన లారీ తిమ్మాపూర్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం. ఈప్రమాదం శనివారం ఉదయం జరగడంతో ఆ సమయంలో ఆ రోడ్డు మీద వెళ్లే స్కూల్ బస్సులకు చాలా ఇబ్బంది కలిగింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది.

చుట్టు పక్కల
లారీ బోల్తా పడ్డట్టు గమనించిన స్థానికుల వెంటనే దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని లేపేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంచితే నేషనల్ హైవే మీద మామిడి పళ్ల లారీ బోల్తా పడిందని తెలియగానే చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.రోడ్డుపై పడ్డ మామిడి పండ్ల కోసం ఎగబడ్డారు. సంచులు, బుట్టల పట్టుకుని వచ్చి అందినకాడికి మామిడిపళ్లను వాటిల్లో నింపుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయ్యో ప్రమాదం జరిగిందే కనీసం లారీలో ఎవరైనా ఉన్నారోమే చూద్దాం,గాయపడ్డ వారికి సాయం చేద్దాం అనే ఆలోచనే లేదు. గాయపడ్డ లారీ డ్రైవర్ని పట్టించుకోకుండా మామిడిపండ్లు ఎత్తుకెళ్లే పనిలో బిజీగా అయ్యారు.
Read Also: KTR : 352 కింద కేటీఆర్పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు