हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Breaking News – Jubilee Hills By-election : నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా? నీ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం.- KTR

Sudheer
Breaking News – Jubilee Hills By-election : నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా? నీ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం.- KTR

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బోరబండలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ “జూబ్లీహిల్స్‌లో ఓటు వేయకుంటే పథకాలు రద్దు చేస్తాం” అని సీఎం రేవంత్ చెప్పిన మాటలు ప్రజాస్వామ్యానికి అవమానమని, ఇలాంటి బెదిరింపులు ఒక నియంత వైఖరిని ప్రతిబింబిస్తాయని కేటీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ఎవరి వ్యక్తిగత సొత్తుకాదు, అవి ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. “రద్దు చేయడానికి నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా?” అంటూ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.

Latest News: Bangalore: బెంగళూరులో చెత్తపై కఠిన చర్యలు – ఫోటో పంపితే నగదు బహుమతి

కేటీఆర్ తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అశాంతి నెలకొంది. బుల్డోజర్ రాజకీయాలతో ప్రజల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. బోరబండలో బుల్డోజర్ రావద్దంటే సునీతమ్మను గెలిపించండి” అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ప్రజలపై గూండాగిరి చేస్తే తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు. “ఎవడన్నా కాంగ్రెసోడు గూండాగిరి చేస్తే గల్లా పట్టి నిలదీస్తాం” అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఉపఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న ఈ సమయంలో, కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ఒకవైపు రేవంత్‌రెడ్డి తన ప్రచారంలో పథకాల కొనసాగింపును ఓటుతో అనుసంధానించగా, మరోవైపు కేటీఆర్ అది ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోరాటంగా మారింది. రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన ప్రతిస్పందనతో ప్రచారం మరింత ముదురుతోంది. ఈ మాటల యుద్ధం చివరికి ఓటర్ల మనసును ఏవైపు మళ్లిస్తుందో, ఫలితాలదాకా ఉత్కంఠ కొనసాగనుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870