हिन्दी | Epaper

IIMR: భవిష్యత్తు అంచనాలకు రియల్ టైమ్ డేటా కీలకం

Tejaswini Y
IIMR: భవిష్యత్తు అంచనాలకు రియల్ టైమ్ డేటా కీలకం

హైదరాబాద్ (అత్తాపూర్) : మొక్కజొన్న పరిశోధనను మార్చడంలో డేటా ఆధారిత విధానాల ప్రాముఖ్యతను లూధియానాలోని ఐసిఎఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ (IIMR) డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. జాట్(H.S. Jat) నొక్కి చెప్పారు. ఎఐసిఆర్పి మొక్కజొన్నలో రియల్టైమ్ డేటా సముపార్జన, డేటా రికార్డింగ్’ అంశంపై మూడు రోజుల వర్క్షాప్ బుధవారం రాజేంద్రనగర్ నార్మ్ ప్రారంభమైంది. రియల్టైమ్ డేటా సేకరణ కోసం అత్యాధునిక సాధనాలు, పద్ధతులు, మొక్కజొన్న పంటల్లో బలమైన అధిక దిగుబడినిచ్చే వాతావరణ నిరోధక సంకరజాతుల ఆవిష్కరణ తదితర అంశాలపై వర్క్షాప్లో చర్చించారు.

Medak News : మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

డాక్టర్ హెచ్.ఎస్. జాట్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా డాక్టర్ హెచ్.ఎస్. జాట్ మాట్లాడుతూ పంటలపై అధికారం కలిగిన కేంద్ర విత్తన కమిటీ, జాతీయ విత్తన రకాల రిజిస్టర్ ఏర్పాటును అందించే ప్రతిపాదిత ముసాయిదా విత్తన బిల్లు నుండి ఈ వర్క్ షాప్ ఉద్భవించిందని, ఈ నిబంధనలు కేంద్ర విత్తన కమిటీ పరీక్ష కోసం సమర్పించిన రకాల సంఖ్యను గణనీయంగా పెంచుతాయన్నారు. ఈ పెరుగుదలను ఊహించి, ఐఐఎంఆర్ చర్చలు ప్రారంభించిందని, రియల్ టైమ్ డేటా(Real time data) సముపార్జన, రికార్డింగ్ వ్యవస్థల వైపు చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అధిక నాణ్యత డేటా ఉత్పత్తిని కూడా నిర్ధారిస్తుందన్నారు.

IIMR: Real-time data is key to future predictions
IIMR: Real-time data is key to future predictions

డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ మాట్లాడుతూ

గౌరవ అతిథిగా హాజరైన ఐసిఎఆర్ఎన్ఎఆర్ఎం డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ మాట్లాడుతూ, ఎఐ సాధనాలతో భవిష్యత్తును అంచనా వేయడానికి రియల్టైమ్ డేటా చాలా కీలకమని అన్నారు. డేటా నిర్వహణ, రిపోజిటరీలు, కమ్యూనికేషన్ నిర్వహణ మరియు వ్యూహాలు, ఆహార వ్యవస్థలు రాబోయే రోజుల్లో ఎక్కువ పాత్ర పోషిస్తాయని అందువల్ల, ఐసిఎఆర్ వీటిపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. ఐసిఎఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎన్. ఛటర్జీ మాట్లాడుతూ మొక్కజొన్న ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఉత్పాదకత, నాణ్యత పౌల్ట్రీ పరిశ్రమను మరింత ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు అని అన్నారు.

దేశంలో 45 రకాల మొక్కజొన్నలను పండిస్తారన్నారు. పిజెటిఎయూ డైరెక్టర్ (విత్తనాలు) డాక్టర్ ఎం. వి. నాగేష్కుమార్ మాట్లాడుతూ, విత్తన రకాల వాణిజ్యీకరణ, లైసెన్సింగ్ కోసం అనేక విత్తన కంపెనీలు సానుకూలంగా ముందుకు వస్తున్నాయని అన్నారు. 100 మొక్కజొన్న రకాలు విడుదలయ్యాయి. ఈ వర్క్షాప్ ఆచరణాత్మక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ ప్యానెల్ చర్చలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫలితాలు భవిష్యత్ ఎఐసిఆర్పి మార్గదర్శకాలు, సహకార ప్రాజెక్టులను రూపొందించడంలో సహాయ పడతాయని అన్నారు.

ఈ వర్క్ షాప్ ను లూథియానాలోని ఐసిఎఆరా ఐఎంఆర్ నుండి డాక్టర్లు ఎన్ సునీల్, భూపేందర్ కుమార్, ఎస్ఎల్ జాట్, అభిజిత్ దాస్ సమన్వయం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సునీల్, వివిధ ఐసిఎఆర్ సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, ప్రైవేట్ రంగ భాగస్వాముల 50 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870