हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Ganjayi: నగరంలో పెరుగుతున్న గంజాయి ముఠాలు

Ramya
Ganjayi: నగరంలో పెరుగుతున్న గంజాయి ముఠాలు

హైదరాబాద్‌ శివార్లలో గంజాయి మత్తులో రెచ్చిపోయిన ముఠాలు

హైదరాబాద్‌ మహా నగరంలో ఇటీవల కాలంలో గంజాయి మత్తులో యువకుల హల్‌చల్‌ అధికమవుతోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చీకటి పడితే చాలు యువకులు గుంపులుగా చేరి మత్తు పదార్థాలను వినియోగిస్తూ, అనంతరం దారిలో వెళ్లే వాహనదారులను, పాదచారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. ఇంటి నుంచి పారిపోయిన యువకులు, పర్యవేక్షణ కరవైన ఆకతాయిలు, మాదకద్రవ్యాలకు (For drugs) బానిసలుగా మారుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, డివైడర్లు, బస్టాపులు, మెట్రో, రైల్వేస్టేషన్ల వద్ద ఉంటూ దాతలు అందించే ఆహారం తీసుకుంటూ, కాలం వెళ్లదీస్తూ, మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. ఆ తర్వాత గంజాయి విక్రయిస్తున్నారు.

Ganjayi: నగరంలో పెరుగుతున్న గంజాయి ముఠాలు

గంజాయి మత్తులో బైక్‌ ప్రమాదం – విదేశాల నుంచే డ్రగ్స్‌ మాఫియా ముడులు

తాజాగా హబ్సిగూడ (Habsiguda) సమీపంలో ఓ యువకుడు గంజాయి మత్తులో బైక్‌ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఎల్లారెడ్డిగూడ (Yellareddyguda) కు చెందిన అతడు గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తండ్రి పలుమార్లు మందలించినా అతడు మారలేదు. విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని చిన్నపాటి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, పెద్ద ముఠాల మద్దతుతో ఈ తరహా నేరాలు జరిగే అవకాశముందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దారిపొడవునా భయం – ఉద్యోగులపై రాళ్ల దాడి

హయత్‌నగర్‌ (Hayatnagar) సమీపంలోని భాగ్యలత కాలనీలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగులు విధులు ముగించుకొని ఇళ్లకు బయల్దేరుతుండగా, కొందరు యువకులు బైక్ పై వెంటపడుతూ ఉద్యోగులను డబ్బులివ్వమని డిమాండ్ చేశారు. ఉద్యోగులు తిరస్కరించటంతో వారిపై రాళ్లతో దాడి చేశారు. సమీపంలోని ప్రైవేటు వసతి గృహంలోకి వెళ్లి దాడి నుంచి తప్పించుకున్నారు. బాధితుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రాకను గుర్తించిన ముఠా అక్కడి నుంచి పారిపోయింది.

గతంలో కూడా తీవ్ర ఘటనలు – దాడిలో వ్యాపారి మృతి

కేవలం తాజా సంఘటనలే కాదు,  గతేడాది కొత్తపేటలో గంజాయి మత్తులో యువకుల ఆగడాలు భరించలేని ఒక వ్యాపారి అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇటీవల కేపీహెచ్‌బీ కాలనీలో అర్ధరాత్రి మత్తు ముఠా వీరంగం సృష్టించింది. ప్రశ్నించిన యువకుడిపై దాడి చేయడంతో అతను మృతి చెందాడు.

పాలక యంత్రాంగం స్పందించాలి – బాధితుల విజ్ఞప్తి

చీకటి పడితే చాలు ఒకేచోట చేరి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. మైకం తలకెక్కాక దారెంట వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. కొద్ది రోజులుగా మత్తుబాబుల ఆగడాలు శృతిమించడంతో వాహనదారులు, పాదచారులు హడలెత్తిపోతున్నారు. ఒంటరిగా వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా ముఠాలపై పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. గంజాయి మత్తులో ఎంతకైనా తెగిస్తున్న ముఠాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Read also: Hyderabad: వీడియో గేమ్ కు బానిస..తల్లి మందలించడంతో ఆత్మహత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

📢 For Advertisement Booking: 98481 12870