हिन्दी | Epaper

Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

Anusha
Kondigari Ramulu: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

Kondigari Ramulu: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (80) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలియగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also: Nizamabad bus accident : నిజామాబాద్‌లో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రస్థానం

1989, 1994 ఎన్నికల్లో సీపీఎం తరపున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తిన నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందారు.సామాన్య కుటుంబంలో జన్మించిన రాములు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ తన జీవితాంతం ఒక సామాన్యుడిగానే గడపడం విశేషం. పదవులు అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టే నేటి కాలంలో, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజా సేవకే అంకితమైన ఆయన ప్రస్థానం భావితరాలకు ఒక గొప్ప పాఠం.

Former Ibrahimpatnam MLA Ramulu passes away
Former Ibrahimpatnam MLA Ramulu passes away

తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన మృతి పట్ల అటు రాజకీయ వర్గాలు, ఇటు ఇబ్రహీంపట్నం ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శవంతమైన విలువలతో కూడిన ఒక నిఖార్సైన ప్రజా నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఆయన కుమారుడు కొండిగారి త్రిలోక్ కుమార్ ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగుతూ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870