हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

Anusha
Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

తెలంగాణ ప్రభుత్వం,రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బోగస్​ కార్డులు, అనర్హులపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు రేషన్ డీలర్ల(Ration dealers) వారీగా జాబితాలో అనర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలెట్టారు. అలాంటి వారి పేర్లు తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండటంతో కొంతమంది లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. ప్రతి పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండటంతో తమ పేరుపై కార్డు ఉంటే చాలని భావించారు. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా కొందరు తీసుకెళ్లడం లేదని సర్కార్​ గుర్తించింది. గత ఆరు నెలలుగా రేషన్‌ బియ్యం(Ration rice) తీసుకోని వారి జాబితా తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. పెళ్లి చేసుకొని వెళ్లిన వారు, మరణించిన వారు, స్థానికంగా లేని వారిని గుర్తించి, ఏరివేత చేపడుతున్నారు.

Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్
Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

లబ్ధిదారులు

వచ్చే నెలలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించడంతో బియ్యం పక్కదారి పట్టుకూడదనే ఉద్దేశంతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ లబ్ధిదారులు రేషన్‌కార్డు(Ration card)లో ఉన్న చిరునామాలో ఉంటున్నారా అందులో ఎవరైనా మృతి చెందారా? వలస వెళ్లారా? అంటూ ఆరా తీస్తున్నారు. మరి కొందరికి రెండు చోట్ల పేర్లు ఉండటంతో అలాంటి వారి పేర్లు ఒకచోట తొలగిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని జూన్‌లో మూడు మాసాలకు సరిపడా కోటాను విడుదల చేయనున్నారు.

Read Also: Miss World: ఆదివారం సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్స్..ఘనంగా ఏర్పాట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870