हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

Anusha
Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

తెలంగాణ ప్రభుత్వం,రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బోగస్​ కార్డులు, అనర్హులపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు రేషన్ డీలర్ల(Ration dealers) వారీగా జాబితాలో అనర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలెట్టారు. అలాంటి వారి పేర్లు తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండటంతో కొంతమంది లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. ప్రతి పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండటంతో తమ పేరుపై కార్డు ఉంటే చాలని భావించారు. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా కొందరు తీసుకెళ్లడం లేదని సర్కార్​ గుర్తించింది. గత ఆరు నెలలుగా రేషన్‌ బియ్యం(Ration rice) తీసుకోని వారి జాబితా తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. పెళ్లి చేసుకొని వెళ్లిన వారు, మరణించిన వారు, స్థానికంగా లేని వారిని గుర్తించి, ఏరివేత చేపడుతున్నారు.

Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్
Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

లబ్ధిదారులు

వచ్చే నెలలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించడంతో బియ్యం పక్కదారి పట్టుకూడదనే ఉద్దేశంతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ లబ్ధిదారులు రేషన్‌కార్డు(Ration card)లో ఉన్న చిరునామాలో ఉంటున్నారా అందులో ఎవరైనా మృతి చెందారా? వలస వెళ్లారా? అంటూ ఆరా తీస్తున్నారు. మరి కొందరికి రెండు చోట్ల పేర్లు ఉండటంతో అలాంటి వారి పేర్లు ఒకచోట తొలగిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని జూన్‌లో మూడు మాసాలకు సరిపడా కోటాను విడుదల చేయనున్నారు.

Read Also: Miss World: ఆదివారం సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్స్..ఘనంగా ఏర్పాట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870