హైదరాబాద్ లో హైడ్రా ప్రారంభం అయినప్పటి నుంచి అక్రమ కట్టడాల గుండెలో భయాన్ని పుట్టిస్తున్నది. మరోవైపు ఆక్రమణలపై హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోతోంది. అయితే హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్ను ఏర్పాటు చేశారు. ఎల్లుండి (జనవరి 6) నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు ఫిర్యాదులను హైడ్రా చీఫ్ స్వీకరించనున్నారు. అలాగే వారం రోజుల్లో హైడ్రా పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు.
సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. హైడ్రా పీఎస్ ఏర్పాటుపై రేపు (ఆదివారం) అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది.
నేరుగా ఫిర్యాదులు
హైడ్రా మరో ముందడుగు వేసింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్ర గ్రీవెన్స్ను ఏర్పాటు చేసింది. ఇకపై హైడ్రా గ్రీవెన్స్ ప్రతీ సోమవారం ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైడ్రా పోలీస్స్టేషన్ కూడా సంక్రాంతికి ప్రారంభంకానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్స్టేషన్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా కూడా హైడ్రా పోలీస్స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు.
సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్స్టేషన్ ద్వారా సేవలను అందుబాటులో ఉంచనున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా గ్రీవెన్స్కు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్లో పాల్గొననున్నారు.