ఐపీఎల్ 2025 సీజన్లో గురువారం సొంత వేదికపై సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)నూ చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించి సన్రైజర్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా బ్యాటర్లు వేగంగా ఆడి ఆ జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ జాక్స్ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రికెల్టన్ (23 బంతుల్లో 31, 5 ఫోర్లు) రాణించారు. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. 20 ఓవర్లలో 162/5కే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా క్లాసెన్ (38) ఫర్వాలేదనిపించాడు. జాక్స్ (2/14)తో పాటు ఎంఐ పేసర్లు హైదరాబాద్ను కట్టడిచేశారు. విల్ జాక్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
స్కేర్ లెగ్
బ్యాటింగ్లో సన్రైజర్స్ తడబడ్డ పిచ్పై ముంబై మాత్రం అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. షమీ రెండో ఓవర్లోనే ఇంప్యాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 26, 3 సిక్సర్లు) తనదైన ట్రేడ్మార్క్ సిక్సర్లతో అలరించాడు. కమిన్స్ ఓవర్లోనూ స్కేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టిన హిట్మ్యాన్ అదే ఓవర్లో ఐదో బంతికి హెడ్కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ రికెల్టన్ (31) ఇషాన్ మలింగ బౌలింగ్లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. హర్షల్ 8వ ఓవర్లోనూ బ్యాక్టుబ్యాక్ బౌండరీలు కొట్టిన అతడు ఐదో బంతికి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యతో జతకలిసిన జాక్స్ ముంబై ఛేదనను వేగవంతం చేశాడు. ఈ ఇద్దరూ ఓవర్కు 10 పరుగులకు తగ్గకుండా ఆడటంతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. మూడో వికెట్కు 29 బంతుల్లోనే 52 రన్స్ జోడించిన వీరిని కమిన్స్ విడదీశాడు. సూర్యతో పాటు జాక్స్ కూడా కమిన్స్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరినా ముంబై పెద్దగా ఇబ్బందిపడలేదు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్(21), నమన్ ధీర్(0) వెంటవెంటనే ఔటైనా సాంట్నర్(0)తో కలిసి తిలక్వర్మ(21 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కమిన్స్(3/26), మలింగ(2/36) ఆకట్టుకున్నారు.

అద్భుతంగా
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా ‘మేం చాలా తెలివిగా బౌలింగ్ చేశాం. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు బంతులు వేసాం. బేసిక్ ప్లాన్స్కు కట్టుబడి బౌలింగ్ చేశాం. ఇలాంటి బంతులు ఆడటం చాలా కష్టం. ప్రత్యర్థి బ్యాటర్లు షాట్స్ ఆడకుండా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ మా బౌలర్లదే. పిచ్ పచ్చ గడ్డితో అద్భుతంగా ఉంది. దీపక్ చాహర్ వేసిన ఆరంభ ఓవర్లలో బంతి ఆగుతూ వెళ్లడం గమనించాం. వెంటనే స్లోయర్ బాల్స్ వేయాలని నిర్ణయించుకున్నాం.ఆ తర్వాత మా బౌలింగ్లో వేరియేషన్స్ మిక్స్ చేశాం. కచ్చితమైన యార్కర్లను సంధించాం. విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను మాకు గన్ ఫీల్డర్. గన్ బౌలర్. ఈ రోజు అతను తన సత్తా చాటాడు. 42 బంతుల్లో 42 పరుగులు చేయడం కూడా కష్టమని మేం భావించాం. అందుకే సమయం తీసుకొని ఆడాం. బౌండరీలు కొడితే ఒత్తిడి తగ్గుతుంది. అందుకే చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాం.’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
Read Also: IPL 2025: మా నెక్ట్స్ మ్యాచ్ హోం గ్రౌండ్లో జరగుతుంది: ప్యాట్ కమిన్స్