ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా,గురువారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో(10 ఓవర్లు మిగిలుండగానే) పంజాబ్పై చిరస్మరణీయ విజయం సాధించింది.ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసిన ఆర్సీబీ(RCB) అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్సీబీ 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్కు క్వాలిఫయర్-2 రూపంలో మారో అవకాశం ఉంది.ఆర్సీబీ ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించింది. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది.
హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings) 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్ సిమ్రాన్ సింగ్(18)తో పాటు జోష్ ఇంగ్లీస్(4), శ్రేయస్ అయ్యర్(2), నెహాల్ వధేరా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపెర్డ్(Romario Shepherd)కు చెరో వికెట్ దక్కింది.అనంతరం ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫిల్ సాల్ట్(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా రజత్ పటీదార్(8 బంతుల్లో ఫోర్, సిక్స్తో 15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసారు.

ఆల్రౌండర్
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంటుందని షేన్ వాట్సన్ పేర్కొన్నారు. ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man of the Match Award)ను గెలుచుకుంటాడని మాజీ ఆర్సీబీ ఆల్రౌండర్ అంచనా వేశాడు.ఖచ్చితంగా ఈ సారి ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. జోష్ హేజిల్వుడ్ అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ ఏడాది ఆర్సీబీదేనని తాను భావిస్తున్నానని షేన్ వాట్సన్(Shane Watson) అన్నాడు.ఐపీఎల్ లీగ్ దశ ముగింపులో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 9 మ్యాచ్లను గెలవగా 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టు 228 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అద్భుతమైన ఘనతను సాధించింది.
Read Also: Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?