Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 3×21 పాయింట్ల విధానం స్థానంలో 3×15 (లేదా 5×11) పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఏప్రిల్ 25న డెన్మార్క్లోని హొర్సెన్స్లో జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై ఓటింగ్ జరగనుంది. అయితే, ఈ ప్రతిపాదనపై క్రీడాకారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
Read Also: Muzarabani: పాకిస్థాన్ లీగ్ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?
ఆట ఓర్పుకు పరీక్ష – సైనా విశ్లేషణ
‘బ్యాడ్మింట్ ఆటకు ఘనమైన చరిత్ర ఉంది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటివి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ టోర్నీల్లో తీమ్రమైన పోటీతో పాటు ఓర్పును ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి.. స్కోరింగ్లో ఏ విధమైన మార్పులు చేయాలనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న 21 పాయింట్ల విధానం ఎంతో బాగుంది.

గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ ఈ స్కోరింగ్కే ఆలవాటు పడ్డారు. ఒకవేళ స్కోరింగ్లో మార్పులు చేస్తే.. ర్యాలీలు ఆడడంపై, పోటీతత్వంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఏదిఏమైనా.. ప్లేయర్ల దృష్టంతా పోటీల మీదే ఉండాలి.. ఆట స్ఫూర్తిని కొనసాగించేలా ఉండాలి’ అని వెల్లడించిన సైనా క్రీడాకారులు సంక్షేమంపై దృష్టి సారించాలని బీడబ్ల్యూఎఫ్ను కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: