India terror conspiracy news : హైదరాబాద్లో మరో ఉగ్రకుట్రకు ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు భద్రతా సంస్థలను అప్రమత్తం చేశాయి. చంచల్గూడ జైలులో ఉన్న లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాది జాహెద్ జైలు నుంచే కుట్రను సమన్వయం చేస్తున్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతను పాకిస్థాన్లో ఉన్న తన సహచరులతో ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్లు తెలిసింది.
మూడు సంవత్సరాల క్రితం దసరా పండుగ సమయంలో హైదరాబాద్లో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన కేసులో జాహెద్తో పాటు అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో హ్యాండ్ గ్రనేడ్లు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల మార్గదర్శకత్వంలో నగరంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో బయటపడింది.
Read Also: Nara Bhuvaneswari: ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం

ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ జాహెద్ మరోసారి కుట్రకు ప్రయత్నిస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. జైలు నుంచి పాకిస్థాన్కు ఫోన్ కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిపై విచారణ చేపట్టగా, అతను తన సోదరుడు మజీద్తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ అంశాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు హైదరాబాద్కు వచ్చి వివరాలు సేకరిస్తున్నాయి.
ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక సహాయం విదేశాల నుంచి అందుతున్న అవకాశాన్ని కూడా నిఘా సంస్థలు పరిశీలిస్తున్నాయి. గతంలో హవాలా మార్గం ద్వారా నిధులు అందినట్లు విచారణలో తేలిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే విధానం అనుసరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
జైలులో నుంచే కుట్ర ప్రయత్నాలపై సమాచారం వెలుగులోకి రావడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసి, అనుమానాస్పద కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: