हिन्दी | Epaper

Simhachalam : కోటి డిమాండ్ చేస్తున్న బాధితులు

Sudheer
Simhachalam : కోటి డిమాండ్ చేస్తున్న బాధితులు

విశాఖపట్నం సింహాచలం ఆలయంలో జరిగిన చందనోత్సవంలో గోడ కూలిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఆమెను ఎదుర్కొన్న బాధిత కుటుంబాలు ఒక్కో కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. తమ ప్రాణాలను కోల్పోయిన కుటుంబ సభ్యుల స్థాయికి తగిన న్యాయం జరగాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రూ.25 లక్షల పరిహారం

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం ఇప్పటికే రూ.25 లక్షల పరిహారంతో పాటు, ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతుల పిల్లల విద్యాభవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గోడ కూలిన సంఘటనపై కమిటీని ఏర్పాటు చేసి, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Read Also : Simhachalam : సింహాచలం ప్రమాదానికి కారణం అదేనా..?

గోడ నిర్మాణంలో లోపాలు

గోడ నిర్మాణంలో ఏవైనా నాణ్యతా లోపాలు ఉన్నాయా? కాంట్రాక్టు ఎవరి వద్ద ఉంది? నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతుందని హోంమంత్రి వెల్లడించారు. ఇది ఊహించని ఘటన అని, తాను కూడా వర్షం కురుస్తున్న సమయంలో అక్కడే దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించామని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందని తెలిపారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, విచారణలో ఎవరి తప్పులైనా బయటపడితే, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టంగా హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

📢 For Advertisement Booking: 98481 12870