हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!

Anusha
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందన్నట్లుగా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్లో ఉన్న ఒక వ్యక్తి ఒకప్పటి పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేక దళాల్లో పారా కమాండర్‌గా ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడే ఒకప్పటి పాక్ పారా కమాండో హషీమ్ మూసా అని తెలుస్తోంది. ఇక దాడి తర్వాత ఉగ్రవాదులు తప్పించుకున్న విధానాన్ని బట్టి చూస్తే వారికి హై లెవల్ ట్రైనింగ్, స్కిల్స్ ఉన్నాయని భద్రతా బలగాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో హషీమ్ మూసా ఒకడని భావిస్తున్నారు.

అత్యాధునిక

పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అత్యాధునిక ఎం 4 రైఫిల్స్‌ను ఉపయోగించడం కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేస్తున్నాయి. వారికి హషీమ్ మూసా ట్రైనింగ్ ఇచ్చారనే అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను వినియోగించేందుకు ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ అవసరమని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హషీమ్ మూసా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్న ఒక కరుడుగట్టిన ఉగ్రవాది అని తెలుస్తోంది. భారత్‌లోని భద్రతా దళాలు, పౌరులపై దాడులు చేయడానికి లష్కరే తోయిబా సంస్థ అతడిని జమ్మూ కాశ్మీర్‌కు పంపించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.

చర్యలు

అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడి మాత్రమే కాకుండా గతంలో కాశ్మీర్‌లో జరిగిన 3 కీలక దాడుల్లో కూడా హషీమ్ మూసా సూత్రధారిగా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడి వ్యూహాత్మక ఆలోచనలు, ఆయుధ శిక్షణ అతడిని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మార్చాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా అతడిని కనిపెట్టాలని భద్రతా దళాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం హషీమ్ మూసా కదలికలపై గట్టి నిఘాను ఉంచాయి. అతడిని పట్టుకోవడం ద్వారా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ప్రాంతంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులు, అందులోనూ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Read Also :Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ ను నిలిపివేసిన ఇండియా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870