हिन्दी | Epaper

PSR Anjaneyulu: ఏపీపీఎస్సీ కేసులో… మాజీ చీఫ్ పీఎస్ఆర్ కు రిమాండ్ పొడిగింపు

Sudha
PSR Anjaneyulu: ఏపీపీఎస్సీ కేసులో… మాజీ చీఫ్ పీఎస్ఆర్ కు రిమాండ్ పొడిగింపు

ఏపీపీఎస్సీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో, పీఎస్ఆర్ ను కాసేపట్లో విజయవాడ జైలు (Vijayawada jail)కు తరలించనున్నారు. సినీ నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆయనను, ఏపీపీఎస్సీ గ్రూప్-1 (appsc group 1)పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన మరో కేసులోనూ పోలీసులు పీటీ వారంట్ పై అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.. ఈ కేసులో(CID) సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

 PSR Anjaneyulu:  ఏపీపీఎస్సీ కేసులో...  మాజీ చీఫ్ పీఎస్ఆర్ కు రిమాండ్ పొడిగింపు
PSR Anjaneyulu: ఏపీపీఎస్సీ కేసులో… మాజీ చీఫ్ పీఎస్ఆర్ కు రిమాండ్ పొడిగింపు

నిధులు దుర్వినియోగం
పీఎస్ఆర్ ఆంజనేయులు 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగమయ్యాయని తీవ్ర ఆరోపణలున్నాయి. వాస్తవానికి మాన్యువల్ మూల్యాంకనం జరగనప్పటికీ, జరిగినట్లుగా రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ఏప్రిల్ 29న ఆంజనేయులుపై ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకం), 420 (మోసం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆంజనేయులును అరెస్ట్ చేసేందుకు పోలీసులు పీటీ వారంట్ కోరగా, విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టు మే 7న అనుమతించింది. ఇవాళ (మే 8) ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచాలన్న ఆదేశాల మేరకు పోలీసులు పీఎస్ఆర్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు రిమాండ్ విధించారు. వాస్తవంగా పేపర్లు దిద్దకుండానే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1 కాగా, మధుసూదన్ ఏ2గా ఉన్నారు.

Read Also : Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870