Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు

Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు

ఏపీప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.బుధవారం నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారితో పాటు, ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్నవారికి కూడా జూన్‌లో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందవచ్చు. వచ్చే సోమవారం నుండి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఒంటరి మహిళలు, ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా బియ్యం కార్డులు ఇవ్వనుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఒక్కటి మాత్రమే కాదు మరికొన్ని సేవల్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయాల్లో రైస్ కార్డులకు సంబంధించి ఏడు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ‘కొత్త బియ్యం కార్డు, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల పేర్లను తొలగించడం, కార్డును తిరిగి ఇవ్వడం, చిరునామా మార్పులు చేసుకోవడం, ఆధార్ కార్డు వివరాల్లో తప్పులను సరిదిద్దడం’ వంటి సేవలను సచివాలయాల్లో పొందవచ్చు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అర్హత ఉండి రైస్ కార్డు లేని పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisements

అవకాశం

కొత్త రైస్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అనంతరం వాటిని పరిశీలించిన తర్వాత అర్హులకు కార్డులు ఇస్తారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తప్పుడు చిరునామాలు, పేర్లలో తప్పులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్పులు చేసుకునే అవకాశం రావడంతో ఊరట దక్కింది. పాత రేషన్ కార్డుల లబ్ధిదారులకు జూన్‌లో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు
Andhra Pradesh: New Ration Card

దరఖాస్తుల వివరాలు

కొత్త రేషన్‌కార్డు,కొత్త సభ్యుల చేర్పు,కుటుంబ సభ్యుల విభజన,చనిపోయిన వారి పేర్ల తొలగింపు,అడ్రస్ మార్పు,బియ్యం కార్డును సరెండర్ చేయడం (వదులుకోవడం).ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్‌ కోడ్‌(QR Code) ఉన్న స్మార్ట్‌కార్డుల్ని జారీ చేయనుంది. గత ప్రభుత్వంలో మాదిరిగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫొటోలేవీ ఉండవు. కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి.. అడ్రస్ మార్చుకోవచ్చు.కార్డుపై కుటుంబ యజమాని పేరు, ఫొటో,కుటుంబ సభ్యుల సంఖ్య,
కార్డులో పెద్దగా బియ్యం కార్డు నంబరు,రేషన్ షాపు ఐడీ, అడ్రస్, క్యూఆర్‌ కోడ్‌,కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు,వారు పుట్టిన తేదీ, వయసు(Age), బంధుత్వం,(పర్మినెండ్ అడ్రస్) శాశ్వత చిరునామా,తహసీల్దారు కార్యాలయం (మండలం),1967 టోల్‌ఫ్రీ నంబరు.

Read Also: Rain: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

Related Posts
Kadiri(AP) 2025 : కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం – ఆధ్యాత్మిక ఉత్సవ విశేషాలు
కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం

కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం 2025 ఆంధ్ర ప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా, కదిరి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రముఖ హిందూ ఉత్సవం. ఈ ఉత్సవం శ్రీ Read more

ChandrababuNaidu: P-4 చైర్మన్‌గా చంద్రబాబు వైస్‌ చైర్మన్‌గా పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా, ఇప్పుడు పలు కీలక ప్రాజెక్టులకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అభివృద్ధి పనులను వేగవంతం Read more

ఇకపై వారికి నెలకు 2 లక్షల జీతం: ఏపీ ప్రభుత్వం
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేబినెట్ హోదా ఉన్నవారికి నెలకు రెండు లక్షల జీతం అందించేందుకు చంద్రబాబు కూటమి Read more

కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టే వారికి తగినంత హెచ్చరికలు, కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు లక్ష్యంగా మారుతున్నారు. తాజాగా, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×