हिन्दी | Epaper

YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

Anusha
YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

యోగి ఆదిత్యనాథ్ తన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ మరోసారి సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పడం సరైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.

బుల్డోజర్ న్యాయం పై వ్యాఖ్యలు

“న్యాయాన్ని నమ్మేవారికి న్యాయం జరుగుతుంది. కానీ, కొందరు స్వయంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, వారికి చట్టం పరిధిలోనే సమాధానం చెప్పాలి. ఏ విధంగా అర్థమవుతుందో, ఆ భాషలోనే వారికి అర్థమయ్యేలా చేయాలి” అని సీఎం యోగి స్పష్టం చేశారు. ‘బుల్డోజర్ న్యాయం’ పేరిట అక్రమ కట్టడాలను కూల్చడంపై ఆయన తమ వైఖరిని సమర్థించారు.

ఓటు బ్యాంకు

దేశంలో ముస్లింలు ప్రమాదంలో లేరని, వారి ఓటు బ్యాంకు రాజకీయమే ప్రమాదంలో పడిందని సీఎం యోగి విమర్శించారు. “భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే ముస్లింలు సురక్షితంగా ఉంటారు. గతంలో కశ్మీర్‌లో ఏమి జరిగిందో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు. పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య ఏ విధంగా తగ్గిపోతోందో కూడా అందరికీ స్పష్టంగా తెలుసని యోగి పేర్కొన్నారు.

cm yogi news 295552761 16x9

ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం యోగి సంబల్ ప్రాంతంలోని ఆలయాల తవ్వకంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంభల్‌లో అన్ని చోట్ల తవ్వకాలు చేపట్టి ఆలయాలను గుర్తిస్తాం. ఎన్ని ఉంటే అన్ని వెలికి తీస్తాం. ప్రపంచం మొత్తం దేవుడు ఇచ్చిన కళ్లతో ఈ ప్రాంతంలో జరిగిన నిజాలను చూడాలి” అని అన్నారు.

హిందువుల జనాభా

భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందని మాట్లాడేవారు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని కూడా ఒకసారి గమనించాలి. 1947కు ముందు ఈ దేశాలు భారత్‌లో భాగంగా ఉండేవి. కానీ, విభజన తర్వాత అక్కడి హిందువులు హింసను ఎదుర్కొన్నారు. ఆ దేశాల్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయింది అని అన్నారు.యోగి అదిత్యనాథ్ మాట్లాడుతూ, “ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఏడేళ్లుగా ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదు. ఇది మా ప్రభుత్వ నిబద్ధతను సూచించే విషయం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది,అని ఆయన అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870