हिन्दी | Epaper

Narendra Modi :ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం: మోదీ

Anusha
Narendra Modi :ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం: మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం న్యూఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాల మార్పిడిని వీక్షించారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ ముంబయి ఉగ్రదాడులు, క్రిస్ట్ చర్చిపై దాడి అంశాల్లో భారత వైఖరి స్పష్టమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి

2008 ముంబయి ఉగ్రదాడులు, 2019 క్రైస్ట్‌చర్చ్ దాడి వంటి ఘటనల్లో భారత వైఖరి మౌలికంగా ఒకటేనని, ఇటువంటి ఘోరమైన ఘటనలపై భారత్-న్యూజిలాండ్ కలిసి పనిచేస్తాయని మోదీ తెలిపారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే చర్యల కోసం న్యూజిలాండ్‌తో సమన్వయం మరింత బలపడుతుందని ఆయన తెలిపారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. ఈ అగ్రిమెంట్‌తో ఇరుదేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని, పాడిపరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. తాము అభివృద్ధివాదాన్ని కోరుకుంటున్నామని, విస్తరణవాదాన్ని కాదని ఇరు దేశాలు వెల్లడించాయి. 2019లో క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనినే మోదీ ప్రస్తావించారు.

భద్రత, వ్యాపారానికి ప్రాధాన్యత

ఈ భేటీలో భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిపారు. భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు న్యూజిలాండ్‌లో మరింత సులభంగా అవకాశాలను పొందుతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రదాడులపై మోదీ వ్యాఖ్యలు

2019లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ పై జరిగిన ఉగ్రదాడిలో 51 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రస్తావించిన మోదీ, ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా అంతర్జాతీయ సహకారంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించే దిశగా భారత్-న్యూజిలాండ్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.భారతదేశం విస్తరణ వాదాన్ని కాదు, అభివృద్ధి వాదాన్ని కోరుకుంటుందని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పెంచేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ భేటీ దోహదపడుతుందని ఇరు దేశాల ప్రధానమంత్రులు నమ్మకం వ్యక్తం చేశారు.ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, భవిష్యత్తులో భారత్-న్యూజిలాండ్ సంబంధాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

📢 For Advertisement Booking: 98481 12870