हिन्दी | Epaper

Tummala: వ్యవసాయ వర్సిటీలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పలు సూచనలు చేసిన నాగేశ్వరరావు

Vanipushpa
Tummala: వ్యవసాయ వర్సిటీలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పలు సూచనలు చేసిన  నాగేశ్వరరావు

హైదరాబాద్: పనుపు రైతులు తమ వంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే విధంగా ధరలలో స్టీరికరణ తేవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు(Tummala Nageswarao) సూచించారు. అందుకోసం పసుపు వంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా(Amith Shah)కు రాష్ట్ర ప్రభుత్వం(Stage Governament) తరపున ఆయన ఒక లేఖను సమర్పించారు. అందులో పసుపు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి సంస్థల ద్వారా నేరుగా కొనుగోళ్లను చేపట్టే విధంగా చర్యలు * తీసుకోవాలని పేర్కొన్నారు. పనుపు ప్రధానంగా వందే ప్రాంతాలలో డ్రైయింగ్ ప్లాట్ఫార్ములు నిర్మాణానికి కేంద్ర నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Tummala: వ్యవసాయ వర్సిటీలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పలు సూచనలు :  నాగేశ్వరరావు
Tummala: వ్యవసాయ వర్సిటీలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పలు సూచనలు : నాగేశ్వరరావు

పసుపు పంటను ఇతర దేశాలకు ఎగుమతి..

రైతుల వద్దనే పనుపు పాలిషింగ్, గ్రేడింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధిక కర్క్యూమిన్ శాతం, వ్యాధి నిరోధకత, ఎగుమతులకు అనుకూలత కలిగిన విత్తన రకాలను అభివృద్ధి వేయడంపై దృష్టి సారిస్తూ, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పసుపు సాగు యాంత్రీకరణ, విలువ ఆధారిత గొలుసు అభివృద్దిపై ఐసీఏఆర్. యుజిసి మద్దతుతో పరిశోధనలకు తోడ్పాటు కల్పించాలని తెలిపారు. భౌగోళిక సూచిక ఆధారంగా తెలంగాణ పసుపును అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మిృప్తి చేశారు. పసుపు పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా మోలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు డాక్యుమెంటేషన్ను సరళీకరించడం, అంతర్జాతీయ వాణిజ్య డెలిగేషన్లు, ఎగ్జిబిషన్లలో రైతుల పాల్గొనడాన్ని ప్రోత్సహించాలన్నారు.

మొబైల్ యాపు అభివృద్ధి

అలాగే పసుపు రైతులకు వారి స్థానిక భాషల్లో సలహాలు అందించే విధంగా మొబైల్ యాపు అభివృద్ధి చేయాలని, విలువ ఆధారిత, సేంద్రీయ సాగు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు సాగులో కార్మిక వ్యయాన్ని తగ్గించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సమన్వయం చేయాలన్నారు. పసుపు రంగ అభివృద్ధి కార్యక్రమాల అమలును పర్యవేక్షిoచేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పనుపు బోర్డు మరియు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రస్తుత పసుపు సాగు పరిస్థితులపై బేస్లైన్ సర్వేను చేపట్టి. వచ్చే ఐదు సంవత్సరాల కోసం ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా. ఆంధ్రప్రదేశ్లోని నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని చెప్పారు. ఏపి పునర్విభజన చట్టం 2014 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, పురుపోత్తపట్నంలను తిరిగి తెలంగాణలో విలీనం వేయాలని కేంద్రమంత్రిని లేఖ ద్వారా కోరారు.

Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870