మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపిన అజిత్ పవార్ అకాల మరణంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అత్యంత భావోద్వేగంతో స్పందించారు. అజిత్ పవార్ మృతి కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణం మాత్రమే కాదని, ఒక నిజాయితీ గల వ్యక్తిత్వాన్ని రాష్ట్రం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉండటం, ఇచ్చిన మాటపై నిలబడటం వల్ల అజిత్ పవార్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వ్యక్తిగతంగా తాను కూడా అటువంటి పరిస్థితులనే అనుభవించానని ఠాక్రే తన ట్వీట్లో గుర్తు చేసుకున్నారు.
Elderly parents :వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా!
రాజకీయాల్లో వ్యూహాలు, మోసాలు సహజమైపోయిన నేటి కాలంలో, అజిత్ పవార్ తనదైన ముక్కుసూటి శైలిని చివరి వరకు కాపాడుకున్నారని రాజ్ ఠాక్రే ప్రశంసించారు. “హామీలు ఇచ్చి ప్రజలను లేదా తోటి నాయకులను మోసం చేయడం అజిత్ పద్ధతి కాదు. ఆ నిజాయితీ వల్లే ఆయన రాజకీయంగా ఎంతో మూల్యం చెల్లించుకున్నారు” అని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అజిత్ పవార్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూనే, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంతో పోల్చి చూపడం విశేషం.

కాగా, అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం ప్రమాదమేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవైపు రాజ్ ఠాక్రే ఆయన గుణగణాలను కొనిాడుతుంటే, మరోవైపు మమతా బెనర్జీ ఈ మరణం చుట్టూ ఉన్న అనుమానాలను లేవనెత్తడం ‘అజిత్ పవార్ మృతి’ ఉదంతాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com