Raghav chadha bank charges : పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఈ విధానాన్ని ఆయన నిశ్శబ్ద దోపిడీగా అభివర్ణించారు.
గత మూడు సంవత్సరాల్లో బ్యాంకులు కనీస నిల్వ లేదనే కారణంతో ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ధనికుల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచి వసూలు చేయబడిందని అన్నారు.
పేదలపై భారం
ఈ పెనాల్టీలు రోజువారీ కూలీలు, రైతులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాఘవ్ చద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర అవసరాల కోసం ఖాతాలోని డబ్బు తీసుకున్న తర్వాత కూడా బ్యాంకులు పెనాల్టీలు విధించడం అన్యాయమని ప్రశ్నించారు.
Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వసూళ్లు
ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11 వేల కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు ఈ విధంగా వసూలు చేశాయని ఆయన వెల్లడించారు.
ఈ పెనాల్టీలను పేదలపై విధించిన పన్నుగా ఆయన అభివర్ణించారు.
పెనాల్టీల రద్దు డిమాండ్
జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాదారులపై భారీ భారం పడుతోందని అన్నారు.
ఈ నేపథ్యంలో మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐని రాఘవ్ చద్ధా డిమాండ్ చేశారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: