हिन्दी | Epaper

Latest Telugu News : Nitin Gadkari : ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ ప‌ర్యావ‌ర‌ణ‌హితం.. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ

Sudha
Latest Telugu News : Nitin Gadkari : ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ ప‌ర్యావ‌ర‌ణ‌హితం.. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ

కేంద్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి గ‌డ్క‌రీ(Nitin Gadkari) ఇవాళ లోక్‌స‌భ‌లో ఇథ‌నాల్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్‌.. రైతుల‌కు లాభ‌దాయ‌కంగా ఉన్న‌ట్లు చెప్పారు. దీని వ‌ల్ల సుమారు 1.40 ల‌క్ష‌ల కోట్ల విదేశీ మార‌కం ఆదా అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ ప‌ట్ల ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేంద్ర రోడ్డుర‌వాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి గ‌డ్క‌రీ స్పందించారు. ఇథ‌నాల్ పెట్రోల్‌పై చాలా విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వాడిన కార్ల‌లో ఎటువంటి చెడు ప్ర‌భావం క‌నిపించ‌లేద‌ని అన్నారు. ఈ-20 పెట్రోల్ వాడ‌కం చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రిణామం అని, ఇది హ‌రిత మార్పు అని, ఈ పెట్రోల్‌తో చాలా త‌క్కువ కాలుష్యం ఉంటుంద‌ని, దీని వ‌ల్ల విదేశీ మార‌కం కూడా ఎక్కువ‌గా ఆదా అవుతుంద‌ని లోక్‌స‌భ‌లో గ‌డ్క‌రీ (Nitin Gadkari) తెలిపారు. ఇథ‌నాల్‌ను పెట్రోల్‌లో క‌ల‌ప‌డం వ‌ల్ల .. ముడి స‌రుకుల కోసం రైతుల‌కు 40 కోట్లు ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని, ఇథ‌నాల్ త‌యారీ కోసం చెరుకు, మొక్క‌జొన్న ముడి ప‌దార్ధాల‌ను వాడుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Read Also :http://Lok Sabha Elections : రాహుల్ Vs అమిత్ షా

Nitin Gadkari
Nitin Gadkari

పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్‌ సింగ్ పురి మాట్లాడారు. ఇథ‌నాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అమ‌లు ద్వారా .. గ‌తంలో క్రూడ్ ఇంధ‌నం దిగుమ‌తి కోసం అయ్యే ఖ‌ర్చును ఇప్పుడు రైతుల‌కు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. దీనితో రైతులు అన్న‌దాత‌లే కాదు, ఇప్పుడు ఊర్జ‌దాత‌లు కూడా అయిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. గ‌డిచిన 11 ఏళ్ల‌లో అంటే 2014 నుంచి 2025 జూలై వ‌ర‌కు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇథ‌నాల్‌ను బ్లెండ్ చేసిన‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలో విదేశీ మార‌క రూపంలో సుమారు 1.40 ల‌క్ష‌ల కోట్లు ఆదా అయిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870