కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు..
ఒకే ప్రధాని హయాంలో భారత ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త చరిత్రను లిఖించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమె వరుసగా 9వ సారి (9th consecutive budget) బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. భారత చరిత్రలో ఒకే ప్రధానమంత్రి హయాంలో ఇన్నిసార్లు వరుసగా బడ్జెట్ను సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఎనిమిది బడ్జెట్లను (అంతంతర బడ్జెట్తో కలిపి) విజయవంతంగా పూర్తి చేశారు. ఈ 9వ బడ్జెట్తో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు.
Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!
దిగ్గజాల రికార్డులతో పోటీ గతంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ (10 సార్లు) పేరిట ఉంది. ఆయన తర్వాత పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ను సమర్పించారు. అయితే, వీరంతా వేర్వేరు ప్రధాన మంత్రుల హయాంలో లేదా వేర్వేరు విడతల్లో ఈ బడ్జెట్లను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మాత్రం ఒకే ప్రధాని నాయకత్వంలో నిరంతరాయంగా 9వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. ఈ క్రమంలో ఆమె పి. చిదంబరం యొక్క మొత్తం బడ్జెట్ల సంఖ్యను సమం చేయడమే కాకుండా, వరుస క్రమంలో అందరికంటే ముందు నిలిచారు.

అంచనాలు మరియు ప్రత్యేకతలు ఈ ఏడాది బడ్జెట్ మరో విశేషానికి కూడా వేదిక కానుంది. ఒక దశాబ్దం తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 1) నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రికార్డు స్థాయి ప్రసంగాలకు పేరుగాంచిన నిర్మలమ్మ, ఈసారి తన 9వ బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక దిశానిర్దేశంపై ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారోనని యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com