Motor accident compensation : రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ప్రసంగంలో మోటారు వాహన ప్రమాద పరిహారంపై వచ్చే వడ్డీకి పూర్తిస్థాయిలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించారు. ఇకపై ఈ వడ్డీపై టీడీఎస్ కూడా ఉండదని స్పష్టం చేశారు. దీంతో బాధితులకు అందాల్సిన మొత్తం పరిహారం పూర్తిగా వారి చేతుల్లోనే చేరనుంది.
ఇప్పటి వరకు మోటారు ప్రమాదాల క్లెయిమ్స్ ట్రైబ్యునల్ (MACT) ద్వారా లభించే వడ్డీని ఆదాయంగా పరిగణించి పన్ను విధించేవారు. కేసుల పరిష్కారంలో ఆలస్యం కావడంతో వడ్డీ మొత్తం పెరిగి, అందులో నుంచి పన్ను కోత పడటం వల్ల బాధిత కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానవతా కోణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తే, వైద్యం, పునరావాసం,(Motor accident compensation) కుటుంబ పోషణ కోసం అవసరమైన మొత్తం డబ్బు నేరుగా బాధితులకు అందుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఇది నిజమైన శుభవార్తగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: