Modi LPG review : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో LPG ఉత్పత్తి, నిల్వలు మరియు సరఫరాపై చర్చ జరిగింది.
ఉత్పత్తి 10 శాతం పెంపు
వంటగ్యాస్ సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు ఇంధన ఉత్పత్తి కంపెనీలు ఉత్పత్తిని 10 శాతం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. LPG ను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ఉన్నతస్థాయి సమావేశం
ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. LPG నిల్వలు, సరఫరా పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
Read Also: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పని
ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) సంస్థలతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. భారత రిఫైనరీలు ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని కేంద్రం తెలిపింది.
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో పెద్ద ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: