हिन्दी | Epaper

ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

Vanipushpa
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

ర్యాగింగ్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వారిని నగ్నంగా మార్చి.. ప్రయివేట్ పార్ట్స్‌కు డంబెల్స్ వేలాడదీసి, జామెట్రీ బాక్సులోని కంపాస్‌తో పొడిచి పైశాచిక ఆనందం అనుభవించారు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు వికృత చర్యలతో జూనియర్లను హింసించి నరకం చూపించారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన అత్యంత భయానక ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి దాష్టీకం బయటపడింది.

విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మొదటి ఏడాది విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో హింసించిన ఐదుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన జూనియర్ విద్యార్థులు కొట్టాయం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నవంబరు నుంచి సీనియర్ల తమను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. బలవంతంగా బట్టలు విప్పదీయించి, మర్మాంగాలకు డంబెల్స్ కట్టి వికృత ఆనందం పొందారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

యావత్ దేశాన్ని కుదిపేసిన సంఘటన

గత నెల కేరళలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. తాము ఉంటోన్న అపార్ట్‌మెంట్ భవనం 26వ అంతస్తులోని ఫైర్‌ ఎగ్జిట్‌ విండో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ బాలుడు ప్రాణాలు పోవడానికి తోటి విద్యార్థుల ర్యాగింగ్ కారణం. తాజాగా, కేరళలో అలాంటి మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్లపై సీనియర్ల దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మద్యం కోసం జూనియర్ల నుంచి డబ్బులు

వారి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. జామెట్రీ బాక్సులో కాంపాస్ సహా పదునైన వస్తువులతోనూ రక్తం వచ్చేలా గుచ్చి ఆయ గాయాలకు లోషన్ రాసి హింసించారు. బాధితులు బాధతో కేకలు వేస్తుంటే, లోషన్‌ను బలవంతంగా వారి నోటిలోకి పూసేవారు. ఈ దుశ్చర్యలను వీడియో తీసి, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ప్రతి ఆదివారం మద్యం పార్టీల కోసం జూనియర్ల నుంచి డబ్బులు లాక్కునేవారు. ఎవరైనా ఎదురుతిరిగితే దారుణంగా కొట్టేవారు. వారి ఆగడాలను తట్టుకోలేకపోయిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పడంతో ఆయన సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు నెలల పాటు వాటి ఆగడాలను మౌనంగా భరించిన విద్యార్థులు.. శ్రుతిమించడంతో చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో యాంటీ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి.. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులు.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870