हिन्दी | Epaper

7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!

Vanipushpa
7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రను బర్డ్ ఫ్లూ కుదిపేస్తోంది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ కారణంగా అనేక కోళ్లు, పక్షులు, జంతువులు మృత్యువాత పడగా.. తాజాగా మహారాష్ట్ర సర్కారే కోళ్లను చంపేస్తోంది. అలాగే బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే గుడ్లను సైతం నాశనం చేస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు చెబుతుండగా..
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతమైన 7 ప్రాంతాలను గుర్తించింది. ఈక్రమంలోనే అక్కడ ఉన్న 7,200 కోళ్లను చంపేసింది. అలాగే 2 వేల 230 గుడ్లను నాశనం చేసింది. చంద్రపూర్ జిల్లాలోని మంగ్లీ గ్రామంలో తాజాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని చెందింది. ఈక్రమంలోనే అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఇప్పటికే 2,065 కోళ్లు చనిపోయాయి.
అయితే విషయం గుర్తించిన రాష్ట్ర పశుసంవర్థక శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతం నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్ని కోళ్లు, గుడ్లు, పశుగ్రాసాన్ని నాశనం చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలోనే చంద్రాపూర్ జిల్లాలో 1,165 గుడ్లతో పాటు 50 కిలోల దాణాను నాశనం చేయించింది. అలాగే కోళ్ల పెంపకం దారులకు నష్ట పరిహారంగా రూ.2,91,963 అందించారు.

7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!


71 కాకులు చనిపోయాయి
ఫిబ్రవరి 6వ తేదీ వరకు మహారాష్ట్రలోని లాతూర్, నాందేడ్, నాగ్‌పూర్, థానే, రాయ్‌గఢ్, చంద్రాపూర్ జిల్లాల నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 7 బర్డ్ ఫ్లూ ప్రభావిత కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ తాలూకాలో 71 కాకులు చనిపోయాయి. ఈక్రమంలోనే వీటికి పరీక్షలు చేయగా.. బర్డ్ ఫ్లూ కారణంగానే ఇవి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.
కేవలం కాకులు, కోళ్లలోనే కాకుండా పులులు, చిరుతలు, రాబందుల్లోనూ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు వివరించారు. అలాగే నాగ్‌పూర్‌లోని గోరేవాడ రెస్క్యూ సెంటర్‌లో ఉంచిన 3 పులులు, ఒక చిరుత పులి సహా 693 జంతువులు, పక్షలు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిట్లు తెలిపారు. ముఖ్యంగా ఇందులో మూడు తెల్లటి వీపు గల రాబందులు కూడా ఉన్నట్లు చెప్పారు.

బయో భద్రతా చర్యలు

పశుసంవర్థక శాఖ అధికారులు మాట్లాడుతూ.. వ్యవస్థీకృత పౌల్ట్రీ సంస్థల నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నివేదించబడలేదని తెలిపారు. కోళ్ల ఫాంల యజమానులు బయో భద్రతా చర్యలు చేపట్టారని.. ముఖ్యంగా కోళ్లు వలస పక్షులతో సంబంధంలోకి రాకుండా చూసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వీటి వల్లే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నివారించవచ్చని స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870