हिन्दी | Epaper

గ్యారెంటీ అమలు కోసం కర్ణాటక సర్కార్ తిప్పలు!

Anusha
గ్యారెంటీ అమలు కోసం కర్ణాటక సర్కార్ తిప్పలు!

ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు గ్యారెంటీల పేరిట పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్‌ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందిపడుతోంది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ పథకాల అమలు మరింత ఆలస్యమవుతోంది.దీంతో లబ్ధిదారులకు పథకాల బకాయిలు పెరిగిపోతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ప్రణాళిక విభాగం తాజా నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేసింది. 2024-25కు గానూ ప్రభుత్వం రూ.3.71 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2024 డిసెంబర్‌ చివరి నాటికి ఇందులో 3.31 లక్షల కోట్లు కేటాయించింది. అయితే, విడుదల చేసినవి మాత్రం కేవలం రూ.2.03 లక్షల కోట్లే. ఇందులో ఖర్చు చేసినవి రూ.1.89 కోట్లు మాత్రమే. కేటాయింపులు, నిధుల విడుదలకు మధ్య రూ.1.28 లక్షల కోట్లు(61.3 శాతం) తేడా ఉండటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నది.

1708745532 1702473334 1688121912 siddaramaiah 3

అందని గ్యారెంటీలు

నిధుల కొరత కారణంగా గ్యారెంటీలు సరిగ్గా అమలు కావడం లేదు. మహిళలకు నెలకు రూ.2000 ఇచ్చే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మూడు నెలలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనవరి 31 నాటికి గృహలక్ష్మి బకాయిలు రూ.7,517 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం అన్నభాగ్య పథకం కింద ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలి. ఇందులో కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం 5 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కొరత కారణంగా కేజీకి రూ.34 చొప్పున డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, 5 నెలలుగా లబ్ధిదారులకు ఈ డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తున్నది.

బెంగళూరు రోడ్ల పరిస్థితిపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు

బెంగళూరులో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయడం భగవంతుడికి కూడా కష్టమేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘భగవంతుడు స్వర్గం నుంచి దిగివచ్చి బెంగళూరు వీధుల్లో నడిచినా రెండుమూడేండ్లలో ఏమీ మారదు. పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతున్నది. మనం సరైన ప్రణాళికతో ప్రాజెక్టులను సమర్థంగా అమలు చేయాలి. భవిష్యత్తు కోసం మంచి కారిడార్‌ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, బెంగళూరు రోడ్లపై 96 శాతం గుంతలను పూడ్చేశామని ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా డీకే శివకుమార్‌ ప్రకటించడం గమనార్హం.

బెంగళూరులో నీటి సంక్షోభం

ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు తీవ్రమైన నీటి కొరత సమస్యను ఎదుర్కొంటోంది. నగర జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి వనరులపై భారం పెరిగిపోతోంది.నీటి సరఫరా పూర్తిగా నిలకడగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870