భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో,భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో ఆధునిక యుద్ధంలో డ్రోన్ల ప్రాముఖ్యం తెలిసివచ్చిందని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ భట్(Anil Bhatt) అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు యుద్ధంలో అంతరిక్షం, సైబర్స్పేస్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. గురువారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ప్రతీ దేశం తమ ఆస్తులను అంతరిక్షంలో సురక్షితంగా దాచుకుంటుందని అంచనా వేశారు. యుద్ధంపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం అనేది చాలా తీవ్రమైన అంశమని, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే యుద్ధం చివరి ఎంపికగా ఉండాలని సూచించారు. ఈయన డోక్లామ్ ఉద్రిక్తతల సమయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్గా పని చేశారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్గాను బాధ్యతలు నిర్వర్తించారు.డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సైనిక కార్యక్రమాల విషయంలో కీలక పాత్ర(key role) పోషిస్తారు. అది యుద్ధంలోనైనా, శాంతి చర్చల్లోనైనా ప్రణాళిక అమలు, పర్యవేక్షణ చేస్తుంటారు. కేవలం ఆర్మీతోనే కాకుండా మూడు విభాగాల మద్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమయంలో యుద్ధం ఒకే విధానంలో జరగడం లేదు. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో కలిపి సమన్వయం చేసుకోవడం చాలా అవసరం.
అవసరం
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్కు తుర్కియే మద్దతు ఇవ్వడంపైనా ఆయన మాట్లాడారు. తుర్కియే యుద్ధ సామాగ్రిని తయారు చేస్తుందని, చాలా దేశాలకు విక్రయిస్తుంటుందని చెప్పారు. ఇందులో భౌగోళిక రాజకీయ కారణాల కన్నా వ్యాపార ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. “భారత్కు యుద్ధంలో ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా డ్రోన్లు(Drones) అవసరం పడుతాయి. ఇందులో చాలా వరకు ఒకసారి ఉపయోగించేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు అవసరం. ఈ మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత్ సామార్థ్యాన్ని పెంచుకోవాలి.” అని అనిల్ భట్ తెలిపారు.
Read Also: Operation sindoor: భారత్కు ఆపరేషన్ సిందూర్తో వేల కోట్ల లాభం! ఎలాగంటే..?