हिन्दी | Epaper

POCSO: కూతురిపై తండ్రి అత్యాచారం పోక్సో కేసు నమోదు

Anusha
POCSO: కూతురిపై తండ్రి అత్యాచారం పోక్సో కేసు నమోదు

రాజస్థాన్లోని అజ్మీర్​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి, తన పదేళ్ల కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, అజ్మీర్​లో బాధితురాలి తల్లింద్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కౌన్సిలింగ్ సమయంలో తండ్రి తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాధితురాలు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అది కూడా తన తల్లి పనికి వెళ్లినప్పుడు అలా చేసేవాడని తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలని బెదిరించినట్లు చెప్పింది. ఈ ఘటనపై రాజస్థాన్ మహిళ కల్యాణ్ మండల్ కో ఆర్డినేటర్ బాధితురాలి తరపున పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో చట్టం (POCSO Act)కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ మహిళా కల్యాణ్ మండల అధికారిణి మాట్లాడుతూ బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.

 POCSO: కూతురిపై తండ్రి అత్యాచారం పోక్సో కేసు నమోదు
POCSO: కూతురిపై తండ్రి అత్యాచారం పోక్సో కేసు నమోదు

కఠినచర్య

‘పోక్సో’ చట్టం బాలికలకు రక్షణ వలయంగా నిలుస్తున్నది. బాలికలపై లైంగికదాడులకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్‌ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు పదుల సంఖ్యల్లో నేరస్తులు ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌(పోక్సో) చట్టం కింద జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు

Read Also : Twin Sisters: పదోతరగతి ఫలితాల్లో ఒకే ప్రతిభను కనబర్చిన కవలలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870