దేశ అత్యున్నత న్యాయస్థానానికి సేవలందించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన పదవీ విరమణ చేసినా కూడా ఇప్పటికీ కృష్ణ మీనన్ మార్గ్ 5లో ఉన్న టైప్ VIII స్థాయి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుండా ఉండటంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై కేంద్రానికి లేఖ రాసిన సుప్రీంకోర్టు, చంద్రచూడ్ తో తక్షణమే కృష్ణ మీనన్ మార్గ్ (Krishna Menon Marg) 5లోని బంగ్లాను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేసింది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేసిన సమయంలో టైప్ VIII స్థాయి ప్రభుత్వ బంగళాలో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిటైర్ అయిన ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాత ఆరు నెలల పాటు మాత్రమే అందులో ఉచితంగా ఉండేందుకు అనుమతిస్తారు.
కొత్తగా నియమితులైన న్యాయమూర్తులకు ప్రభుత్వం
అయితే, జస్టిస్ చంద్రచూడ్ ఇప్పటికీ తాను సీజేఐగా ఉన్నప్పుడు వాడిన టైప్ 8 స్థాయి బంగళాలోనే ఉంటున్నారు. దీంతో కొత్తగా నియమితులైన న్యాయమూర్తులకు ప్రభుత్వం అధికార నివాసాల కొరత తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో జులై 1న కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు (Supreme Court) అధికారులు లేఖ రాశారు. ‘‘2025 మే 31తో ఆయనకు అనుమతించిన గడువు ముగిసింది. ఇకపై ఆయన బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. 2022 నిబంధనల ప్రకారం గడువు మించిపోయినందున వెంటనే ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. జస్టిస్ చంద్రచూడ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ, బంగ్లా వివాదం తెరపైకి రావడం గమనార్హం.

ప్రత్యేక అవసరాలు
దీనిపై చంద్రచూడ్ స్పందిస్తూ, నివాసం మారడంలో జాప్యానికి వ్యక్తిగత పరిస్థితులే కారణమని వెల్లడించారు. ‘ఇప్పటికే నాకు ప్రభుత్వం అద్దెకు ఇల్లు కేటాయించింది. కానీ ఆ బంగ్లా గత రెండేళ్లుగా మూసి ఉంది.దాని మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే వెళ్లిపోతాను. ఈ విషయం న్యాయస్థానం అధికారులకు ముందే తెలియజేశాను’ అని వివరించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక అవసరాలు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు నెమలిన్ మయోపథీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ ఎయిమ్స్ (AIIMS) లో చికిత్స పొందుతున్నారు.ఇది పూర్తిగా నా వ్యక్తిగత బాధ్యత, కానీ మానవతా దృక్పథంలోనూ ఇది అర్థవంతమే. నాకు ఉన్న పరిస్థితులు కూడా ముఖ్యమే. గతంలోనూ కొందరు సీజేఐలు గడువు ముగిసినా బంగ్లాలో ఉన్న సందర్భాలు ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం..భారీగా ప్రాణనష్టం