Credit card : ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు తమ కార్డులపై అందించే ప్రయోజనాలను భారీగా తగ్గిస్తున్నాయి.
విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల వంటి సౌకర్యాలను కుదిస్తూ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. కేవలం ప్రయోజనాలు తగ్గించడమే కాకుండా, వాటిని పొందేందుకు అవసరమైన కనీస ఖర్చు పరిమితిని కూడా పెంచడం గమనార్హం.
అమెరికన్ ఎక్స్ప్రెస్ మార్పులు
అమెరికన్ ఎక్స్ప్రెస్ తన ప్లాటినం ట్రావెల్ కార్డ్ రివార్డులను మార్చి 9 నుంచి తగ్గించింది. గతంలో రూ.1.9 లక్షల ఖర్చుపై లభించే 15,000 పాయింట్లు ఇప్పుడు 7,500 పాయింట్లకే పరిమితమయ్యాయి.
అలాగే రూ.4 లక్షల ఖర్చుపై ఇచ్చే 25,000 పాయింట్లు మరియు రూ.10,000 విలువైన తాజ్ వోచర్ను కూడా తగ్గించి, ఇప్పుడు కేవలం 10,000 పాయింట్లను మాత్రమే ఇస్తున్నారు. అదే వోచర్ పొందాలంటే ఇప్పుడు రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇతర బ్యాంకుల నిర్ణయాలు
ఎస్బీఐ కార్డ్ తన ఐదు పాపులర్ కార్డులపై ఏటా ఇచ్చే 8 ఉచిత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనలను 4కి తగ్గించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ తన ప్లాటినం కార్డులపై ఇచ్చే ఉచిత సినిమా టికెట్ సౌకర్యాన్ని పూర్తిగా తొలగించింది. అలాగే రవాణా ఖర్చులపై వచ్చే రివార్డ్ పాయింట్లకు నెలకు రూ.20,000 వరకు పరిమితి విధించింది.
యాక్సిస్ బ్యాంక్ మరో అడుగు ముందుకేసి, కార్డు క్లోజ్ చేసిన 30 రోజుల్లోనే రివార్డ్ పాయింట్లు గడువు ముగిసేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

కొత్త ఖర్చు నిబంధనలు
ఫెడరల్ బ్యాంక్ భాగస్వామ్యంతో నడిచే స్కాపియా కార్డు కూడా ఉచిత లాంజ్ యాక్సెస్ కోసం కనీస నెలవారీ ఖర్చును రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచింది.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ఇన్ఫీనియా కార్డుపై స్మార్ట్ బై వోచర్ పాయింట్లను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ, వినియోగదారుల నిరసనలతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
యూజర్లకు హెచ్చరిక
ఈ మార్పులన్నీ గమనిస్తే ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా లాభాలు పొందడం కొంత కష్టతరమవుతుంది. వినియోగదారులు తమ కార్డు నిబంధనలను సరిగా పరిశీలించి ఉపయోగించడం అవసరం.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: