Congress party elections : 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి 2026లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి. ఏప్రిల్–మే నెలల్లో కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను పార్టీ “సెమీఫైనల్”గా భావిస్తోంది. కనీసం ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో విజయం సాధించి రాజకీయంగా తన బలం నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ముందుంది.
Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్కు ఉత్సాహం ఇచ్చాయి. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంతర్గత పోటీ రాకుండా అధిష్ఠానం జాగ్రత్త పడుతోంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తు కొనసాగుతున్నప్పటికీ సీట్ల పంపకం వంటి అంశాలు చిక్కుగా మారాయి. అసోంలో అంతర్గత విభేదాలు పార్టీకి సవాలుగా ఉండగా, పశ్చిమ బెంగాల్లో తృణమూల్తో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశముంది. ఈ ఎన్నికల ఫలితాలు 2029 లోక్సభ పోరుపై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: