తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లనున్నారు. అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో‘ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ఆయన వెంట పలువురు ప్రముఖులు కూడా వెళ్లనున్నారు.

ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా సీఎం రేవంత్కు తోడుగా ఉండనున్నారు. మహూ కంటోన్మెంట్ ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జీవితం, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ జరుగుతుంది.ఈ కార్యక్రమం ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య మూలసిద్ధాంతాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని వివరిస్తారు.
‘సంవిధాన్ బచావో’ ర్యాలీకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్గింది. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ర్యాలీపై ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. అంబేడ్కర్ స్వగ్రామం నుండి వ్యాప్తి చెందుతున్న సందేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా అన్న దిశగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు బయలుదేరి వెళ్లారు. నేటి ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా సీఎంతో పాటు వెళ్లారు.
ఏఐసీసీ ఆధ్వర్యంలో ఇండోర్ జిల్లా మోవ్లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొననున్నారు.. కాగా, మహూ కంటోన్మెంట్ ప్రాంతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య మూలసిద్ధాంతాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన వివరిస్తారు.
సాయంత్రం ఈ కార్యక్రమాలు ముగిశాక సీఎం రేవంత్ తన బృందంతో కలిసి తెలంగాణకు తిరిగి చేరుకుంటారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలపరిచేందుకు ఆయన ప్రయత్నించనున్నారు. ర్యాలీ విజయవంతంగా పూర్తవుతుందని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.